Categories: andhra pradeshNews

Ys Jagan : హుటాహుటిన లండన్ బయలుదేరిన జగన్ .. విచిత్రమైన కారణం..!

Advertisement
Published by
Advertisement

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్లడం కొత్తేమీ కాకపోయినా ఆయన ఈ పర్యటన కోసం సిబిఐ కోర్టుకు విన్నవించుకున్న కారణం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఆ వేడిని తాను తట్టుకోలేకపోతున్నానని అందుకే లండన్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరడం విచిత్రంగా కనిపిస్తోంది. నిజానికి ఎప్పుడూ ఏసీ గదుల్లో ఏసీ కార్లలో తిరిగే ఆయనకు ఎండ వేడి అనేది ఒక సాకు మాత్రమేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఆయన లండన్ లోనే ఉండబోతున్నారు. దీనికి కోర్టు కూడా పచ్చజెండా ఊపడంతో జగన్ తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

Ys Jagan : హుటాహుటిన లండన్ బయలుదేరిన జగన్ .. విచిత్రమైన కారణం..!

అయితే ఈ పర్యటన వెనుక కేవలం ఎండలు మాత్రమే కారణం కాదని దీని వెనుక పెద్ద ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్ల దుబాయ్ వంటి దేశాల్లో నిధులు నిలిచిపోయాయని ఆ చిక్కుముడులను విప్పడానికే జగన్ లండన్ వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారు. ఆ పాదయాత్రకు కావాల్సిన భారీ ఖర్చుల కోసం అలాగే ఇతర వ్యాపార వ్యవహారాల కోసం నిధులను సమకూర్చుకోవడానికే ఈ విదేశీ పర్యటన పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఆఫ్రికా వంటి దేశాల్లో ఉన్న వ్యాపారాల ద్వారా వచ్చే సొమ్మును లండన్ లో సెటిల్ చేయడం సులభం కాబట్టి ఆయన అక్కడకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయన ఇలాగే విదేశాలకు వెళ్లినప్పుడు సిబిఐ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయడం లేదని ఈమెయిల్స్ కు స్పందన లేదని అప్పట్లో కోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి.

Advertisement

ఈసారి పర్యటనలో విజయసాయి రెడ్డి కూడా జగన్ తో కలిసే అవకాశం ఉందని సమాచారం. గతంలో వీరిద్దరి మధ్య కొంత దూరం పెరిగినట్లు వార్తలు వచ్చినా ఇప్పుడు మళ్లీ ఆర్థిక వ్యవహారాల కోసం ఇద్దరూ కలిసినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా పట్టు కోల్పోతోందని భావిస్తున్న జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగే అవకాశం ఉంది. నియోజకవర్గాల స్థాయిలో యూట్యూబ్ ఛానళ్లు మరియు వెబ్ సైట్లు ఏర్పాటు చేసి పార్టీని మళ్లీ బలోపేతం చేయాలని ఆయన చూస్తున్నారు. ఏది ఏమైనా ఎండలు తట్టుకోలేక విదేశాలకు వెళ్తున్నానని చెప్పడం వెనుక ఉన్న అసలు రాజకీయ మరియు ఆర్థిక పరమైన మతలబులు ఏమిటో జగన్ తిరిగి వచ్చిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ లండన్ టూర్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Recent Posts

AP Survey : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. మైండ్ బ్లాక్ సర్వే!

AP Survey  : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…

21 minutes ago

Telangana BJP : తెలంగాణలో బీజేపీ దెబ్బతినడానికి ఇదే అతిపెద్ద కారణం..!

Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…

3 hours ago

Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం !

Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…

5 hours ago

Modi : బిల్లు విషయం లో మోడీ ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయ్యింది , లోక్ సభ లో అట్టర్ ఫ్లాప్..!

Modi  : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…

6 hours ago

Viral video : బుల్లితెరపై కొత్త వినోద వేదిక .. మాజీ మంత్రి ముందే ప్రోమోలో రొమాన్స్ .. !

Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…

8 hours ago

Dwakra Group : డ్వాక్రా మహిళలకు తీపి కబురు .. ఆ సమస్యలకు చెక్ .. ఇక పై 72 గంటల్లోనే అకౌంట్‌లో డబ్బులు .!

Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…

11 hours ago

Red Banana : ఎర్రటి అరటి పండు ఎప్పుడైనా తిన్నారా? .. కనబడితే వెంటనే కొనేయండి .. ఎందుకంటే.?

Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…

12 hours ago

Fast Eating : ఫాస్ట్ గా తింటున్నారా? .. ఇక మీ ప్రాణాలు .. బీ కేర్ ఫుల్ ..!

Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…

14 hours ago

Nails : జాగ్రత్త.. గోళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? .. అయితే మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్టే..!

Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్‌ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…

15 hours ago

Pakistan : పైకి బిల్డప్ , తెర వెనక ముష్టి ఎత్తుకుంటూ దొరికిపోయిన పాకిస్తాన్..!

Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…

24 hours ago

Mahila Reservation Bill : లోక్‌సభలో కేంద్రానికి షాక్‌ .. వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్‌సభలో కేంద్ర…

1 day ago

Iran Usa : యుద్ధం మధ్యలో అసలైన శత్రువు రంగంలోకి దిగాడు .. భారీ ట్విస్ట్

Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…

1 day ago