
Ys Jagan : రైతు సమస్యలు పట్టింకుకోరా... కూటమి సర్కార్ పై అన్నా చెల్లెలు ఫైర్..!
Ys Jagan : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కనీస మద్దతు లేక రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Ys Jagan : రైతు సమస్యలు పట్టింకుకోరా… కూటమి సర్కార్ పై అన్నా చెల్లెలు ఫైర్..!
పెప్పర్, పత్తి, జొన్న, కందులు, మినుములు, టమోటా, అరటి, పొగాకు వంటి పంటలకు కనీస ధరలు లభించకుండా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని , మిర్చి రైతులను నమ్మించి కేంద్రం ద్వారా నాఫెడ్ కొనుగోలు చేస్తుందని చెప్పి, చివరికి ఒక్క క్వింటాలైనా కొనకుండా రైతులకు నష్టాలూ, తెచ్చారని జగన్ విమర్శించారు. తన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధిగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కనీసం ఆ విధానాన్ని కొనసాగించినా, రైతులకు కాస్త ఊరట లభించేదన్నారు.
బడ్జెట్లో కేవలం 300 కోట్ల రూపాయలే కేటాయించడం విడ్డూరంగా ఉందని, అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చయిన ఆధారాలున్నాయా? అని జగన్ ప్రశ్నించారు. ధాన్యం, కోకో, ఆక్వా, పొగాకు రైతులు ఆందోళనల్లో ఉండగా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల సంక్షోభం పెరుగుతుందని, లక్షల మంది రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకుని రైతుల పక్షాన నిలవాలని జగన్ డిమాండ్ చేశారు.
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
This website uses cookies.