
Chandrababu : కింజరాపు కుటుంబానికి చంద్రబాబు మరో గిఫ్ట్..!
Chandrababu : శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబానికి చంద్రబాబు నాయుడు సర్కార్ గిఫ్ట్ అందించింది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ అడిషనల్ ఎస్పీగా ఇటీవల పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డీగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎక్స్ అఫీషియో కార్యదర్శి, డీజీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీచేశారు.
Chandrababu : కింజరాపు కుటుంబానికి చంద్రబాబు మరో గిఫ్ట్..!
ప్రభాకర్ నాయుడు సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖలో సేవలందించారు. ఇటీవల ఆయన పదవీ విరమణ చేయగా.. ఆయన సేవలు అవసరమని భావించిన ప్రభుత్వం ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రభుత్వం తిరిగి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డీగా నియమించింది. అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడు విశాఖపట్నంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీఎస్పీగా ఉండగా అడిషనల్ ఎస్పీగా ఇటీవల ప్రమోషన్ దక్కింది.. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన రిటైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఓఎస్డీ నియమించింది.
ఈ పరిణామంతో కింజరాపు కుటుంబం పట్ల చంద్రబాబుకు ఉన్న అభిమానం మరోమారు అంతా చర్చించుకుంటున్నారు. కింజరాపు కుటుంబం పార్టీకి నిబద్ధతతో చేస్తున్న సేవలను గుర్తించిన చంద్రబాబు వారిని సముచితంగా గుర్తింపు ఇచ్చి ఆదరిస్తున్నారు. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడుకు అవకాశం కల్పించడం ద్వారా బాబు బాబు ఆ ఫ్యామిలీకి ఇస్తున్న విలువ ఏంటో చెప్పారు.
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
Whatsapp : వాట్సాప్ తన యూజర్ల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని వరుసగా కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే…
Akira Nandan Tollywood entry : మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో ఎప్పుడు వస్తాడా అని అభిమానులు…
Success Story : జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే ఉన్నత విద్య, విదేశీ డిగ్రీలు తప్పనిసరి అని చాలా మంది…
Threatening Letters : ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం 'బెదిరింపు లేఖల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వంలో…
Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది. పట్టణ స్థానిక…
PM Surya Ghar Yojana : దేశంలో విద్యుత్ ఛార్జీలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ కుటుంబాలపై ఆర్థిక భారం మోపుతున్నాయి.…
This website uses cookies.