Home » Andhra Pradesh » Husband Kills Wife Lover Extramarital Affair Leads To Murder
andhra pradesh

Husband Wife : ఇలా త‌యార‌య్యారేంట్రా.. భ‌ర్త క‌ళ్ల‌ముందే ప్రియుడితో భార్య హ‌ల్‌చ‌ల్.. ఏమైందంటే..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 11, 2025, 7:00 pm
Advertisement

Husband Wife : ఈ రోజు వివాహేత‌ర సంబంధాలు ఎక్కువ‌వుతున్నాయి. దాని వ‌ల‌న హ‌త్యలు జ‌రుగుతున్నాయి. భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనకు, తన పిల్లలకు తనను దూరం చేశాడనే పగతో హ‌త్య చేయ‌డం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో సంచ‌ల‌నంగా మారింది. శృంగవరపుకోట మండలం చామలాపల్లిలో తొత్తిడి ప్రసాద్ అనే వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. గ్రామంలో నడుపూరి మురళీ అనే యువకుడికి గత పదిహేనేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది.

Advertisement

Husband Wife : ఇలా త‌యార‌య్యారేంట్రా.. భ‌ర్త క‌ళ్ల‌ముందే ప్రియుడితో భార్య హ‌ల్‌చ‌ల్.. ఏమైందంటే..!

Husband Wife ఎందుకీ పాపం..

అనంతరం వారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్యాపిల్లలతో హాయిగా జీవిస్తున్నాడు ప్రసాద్. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన తొత్తిడి ప్రసాద్ అనే చిరువ్యాపారి మురళీ భార్యతో ప‌రిచ‌యం ఏర్ప‌ర‌చుకున్నాడు పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. గత ఐదేళ్లుగా ప్రసాద్, మురళీ భార్యల మధ్య అక్రమసంబంధం కొనసాగుతూనే ఉంది. భార్యాభర్తలు ఇద్దరు తరచూ ప్రసాద్ విషయంలో గొడవ పడుతుండేవారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే మురళీ భార్య మురళీని వదిలేసి తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత మురళీ అనేకసార్లు తన భార్యతో మాట్లాడి తన ఇంటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయినా తన భార్య మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా తరచూ ప్రసాద్ తో కలిసి ఉండటం మురళీ కంటపడుతూనే ఉంది. ప్రసాద్ ను అడ్డు తొలిగిస్తే తప్పా తన భార్య తన మాట వినదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక శుభకార్యం కోసం వ్యాపారంలో భాగంగా టెంట్లు వేస్తున్నాడు ప్రసాద్. ఇదే అదునుగా భావించిన ప్రసాద్ కత్తితో అకస్మాత్తుగా దాడి చేశాడు. తన పై దాడి జరుగుతుందని తేరుకునే లోపే ప్రసాద్ పై కత్తిపోట్ల వర్షం కురిపించాడు.. ఆ దాడిలో ప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి