YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగి దాదాపు 11 రోజులు కావస్తోంది. ఇక ఎన్నికల ఫలితాలకు మరో 10 రోజులు గడువు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఎన్నికల ఫలితాల్లో అన్ని పార్టీల నుండి ప్రత్యేకమైన ధీమా కనిపిస్తున్నప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గట్టి ఫైట్ నెలకొంది. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఆఫ్ లైన్ – అన్ లైన్ అనే బేధం లేకుండా రాబోయే ఎన్నికల ఫలితాలపై కోట్లాది రూపాయల బెట్టింగ్ కొనసాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ గెలుస్తుందా..? కూటమి గెలుస్తుందా..? ఫలానా నేత గెలుస్తాడా..? ఓడిపోతాడా..? గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది..? ఓడిపోతే ఎన్ని ఓట్లతో ఓడిపోతాడు…?ఈ విధంగా అనేక రకాల అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెద్ద ఎత్తున బెట్టింగ్ కొనసాగుతోంది.
దీనిలో భాగంగానే అధికార పార్టీ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి విపక్ష పార్టీ చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు లోకేష్ , రఘురామకృష్ణంరాజు ఈ విధంగా రాజకీయ నేతల మెజారిటీపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. అయితే ఈ బెట్టింగ్స్ లో భాగంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత మెజారిటీీ వస్తుందని ఎక్కువమంది బెట్టింగ్ కాస్తున్నట్లుగాా తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డి పోటీ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే ఆ నియోజకవర్గం నుండి జగన్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని 60 నుండి 67 వేల వరకు మెజారిటీ వస్తుందని ఎక్కువమంది బెట్టింగ్స్ కాస్తున్నట్లుగా తేలుస్తోంది. ఇక ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గం నుండి 34 లేదా 37 సీట్ల మెజారిటీ లభించే అవకాశం ఉందని ఇక పవన్ కళ్యాణ్ కు 40 నుంచి 47 వేల వరకు రఘురామకృష్ణం రాజుకు13 నుండి 17 వేల వరకు అలాగే లోకేష్ కు 35 నుండి 45వేల వరకు మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఎక్కువ మంది బెట్టింగ్స్ కడుతున్నారు.
దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కీలక నాయకులు పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలలో వచ్చే మెజారిటీలపై బెట్టింగ్ లపై కొనసాగడం చర్చనియాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ కీలక నేతలు అయినటువంటి వల్లభనేని వంశీ, కొడాలి నాని ,అంబాటి రాంబాబు , ఆర్కే రోజా, జోగ్ రమేష్, అనిల్ కుమార్ యాదవ్, గుడివాడ అమర్నాథ్ , మరగాని భరత్ వంటి వారు ఓడిపోయే అవకాశాలు ఉన్నట్లుగా ఎక్కువమంది బెట్టింగ్స్ కాయడం విశేషం. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో వైయస్ జగన్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని అంశం పై బెట్టింగ్స్ ఎక్కువగా కోనసాగుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ కి మరోసారి అధికారం దక్కే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.