
Chandrababu : చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న 'కనిపించని శక్తులు' ?
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి నిర్ణయాలే ఫైనల్ అని అందరూ భావిస్తారు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాత పద్ధతులకు, ఆయన పనితీరుకు ఏమాత్రం సంబంధం లేకుండా పాలన సాగుతోందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జోరందుకుంది. నిజానికి చంద్రబాబు అంటేనే అడ్మినిస్ట్రేషన్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న నాయకుడు, కానీ ఇప్పుడు ఆయన కేవలం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వడానికి, మీడియా ముందు కనిపించడానికి మాత్రమే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కథ అంతా పార్టీ ఆఫీసులోని మూడో అంతస్తులో నడుస్తోందట. అక్కడ కూర్చున్న కొందరు రాజకీయ బ్రోకర్లే ఫైళ్లను వెనక నుండి నడిపిస్తున్నారని, వారి కనుసన్నల్లోనే మొత్తం వ్యవహారం సాగుతోందని సమాచారం. ఇలాంటి కనిపించని శక్తుల ప్రభావం పెరిగిపోవడం వల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Chandrababu : చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ‘కనిపించని శక్తులు’ ?
ముఖ్యంగా పోలీస్ శాఖలో జరుగుతున్న బదిలీల వ్యవహారం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. దాదాపు ఏడాది కాలంగా కీలకమైన పోలీస్ పోస్టింగ్స్ ఆగిపోయాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిజిపి స్థాయి అధికారులు కూడా నామమాత్రపు పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. ఇటీవల డిజిపి హరీష్ కుమార్ గుప్తా కొన్ని బదిలీల కోసం ఒక ఫైల్ పంపిస్తే, దానికి సమాంతరంగా లోకేష్ కార్యాలయం నుండి రిటైర్డ్ డిజిపి ఆర్.పి. ఠాకూర్ మరో ఫైల్ పంపారట. ఈ రెండు ఫైళ్లలో ఉన్న పేర్లు వేరువేరుగా ఉండటంతో అసలు ఎవరి మాట వినాలో తెలియక ఆ ఫైల్నే పక్కన పడేశారు. అంటే రాష్ట్ర పోలీస్ బాస్ అయిన డిజిపి కూడా తన శాఖలో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి ద్వంద్వ పాలన వల్ల వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్నాయని సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ “కనిపించని శక్తుల” హవా మంత్రులపై కూడా తీవ్రంగా చూపిస్తోంది. మంత్రులకు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఏదైనా పని చేయాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం కంటే ముందు ఈ వెనక ఉన్న శక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తోందట. దీంతో పార్టీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నాయకులు, మంత్రులు తీవ్రమైన అసహనానికి గురవుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు అంటే క్రమశిక్షణకు మారుపేరు, కానీ ఇప్పుడు ఆయన కళ్ళ ముందే ఇలాంటి పక్కదోవ పట్టించే శక్తులు పైచేయి సాధిస్తుంటే ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రజలు నమ్మి ఓట్లేసింది చంద్రబాబు నాయకత్వానికి, కానీ పాలన మాత్రం వేరే వారు చేస్తున్నారన్న వార్తలు భవిష్యత్తులో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారేలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం మంచివి కావు.
Gold : ప్రస్తుత రోజుల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎంతో ఆసక్తి…
Harsha Veena : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా హర్ష వీణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోషల్…
RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు…
Prabhas vs Dhurandhar : తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన సినిమా బాహుబలి 2. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్…
Students : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం మరియు వారి విద్యా భవిష్యత్తుపై కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన…
Viral video : భారత క్రికెట్ స్టార్, ఆర్సీబీ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు మరోసారి సోషల్ మీడియాలో…
IPL 2026 : ఐపీఎల్ 2026 సందడి నేటి నుంచే ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీస్ ఉన్నతాధికారి వీసీ…
LPG Gas : దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాపై ఆందోళన క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత కారణంగా…
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే.…
This website uses cookies.