Wife : వామ్మో ఇలా తయారేంట్రా.. బాబు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఇల్లాలు..!
Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య అనే వ్యక్తిని భార్య రవనమ్మ తన తమ్ముడితో కలిసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. వ్యక్తిగత విభేదాలు, తరచూ జరిగే తగాదాలు రోజు రోజు పెరుగుతూ భయంకర హత్యకు దారితీశాయి. పిడుగురాళ్లకు చెందిన రవనమ్మ గతంలో రమనయ్యను వివాహం చేసుకోగా, వివాహానంతరం వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. విభేదాలతో రవనమ్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది.
Wife : వామ్మో ఇలా తయారేంట్రా.. బాబు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఇల్లాలు..!
ఈ పరిణామాల నేపథ్యంలో రమనయ్య భార్యను తిరిగి తీసుకురావడానికి పిడుగురాళ్లకు వెళ్లగా అక్కడ మరొకసారి వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ గొడవలో రవనమ్మ తన తమ్ముడితో కలిసి భర్తపై దాడికి దిగింది. కిరాతకంగా రమనయ్యను హత్య చేసిన తరువాత, మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లా నూనెపల్లెలో వారి ఇంటి వద్ద పడేసినట్టు సమాచారం. అనంతరం రవనమ్మ పరారైనట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానితులైన రవనమ్మ, ఆమె తమ్ముడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా ఖచ్చితంగా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చిన్న గొడవలు, విభేదాలు ఇలా ప్రాణహానికే దారితీయడం విచారకరం. వరుసగా జరిగే ఇలాంటి ఘటనలతో భర్తలకూ రక్షణ ఉందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
Curry Leaves | రోజువారీ వంటల్లో సుగంధాన్ని పెంచే కరివేపాకు ఆకులకి, అసలు మనం ఇచ్చే గౌరవం తక్కువే అనిపించొచ్చు.కానీ…
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
This website uses cookies.