
YS Bharathi Reddy : వై ఎస్ భారతి పై కోర్టుకెక్కిన రఘురామ కృష్ణం రాజు..!
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు (RRR) మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా తనపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ సాక్షి మీడియా గ్రూప్పై ఆయన యుద్ధం ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇందిరా టెలివిజన్ మేనేజింగ్ డైరెక్టర్ వైఎస్ భారతీ రెడ్డితో పాటు సాక్షి ఎడిటర్, బ్యూరో చీఫ్, మరియు బోర్డు డైరెక్టర్లకు రఘురామ లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.తన వ్యక్తిగత ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో సాక్షి మీడియా వరుసగా తప్పుడు వార్తలను వండి వారుస్తోందని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే తన క్యారెక్టర్ను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు.
YS Bharathi Reddy : వై ఎస్ భారతి పై కోర్టుకెక్కిన రఘురామ కృష్ణం రాజు..!
ఇటీవల హెరిటేజ్ ఉత్పత్తుల విషయంలోనూ, అలాగే తన వ్యక్తిగత రాజకీయ ప్రయాణంపై సాక్షిలో వచ్చిన వార్తలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఏదైనా వార్తపై అభ్యంతరం ఉంటే ఆ పత్రిక ఎడిటర్కో లేదా విలేకరికో నోటీసులు ఇస్తారు. కానీ, రఘురామ కృష్ణం రాజు నేరుగా ఆ సంస్థ అధినేత్రి వైఎస్ భారతీ రెడ్డిని టార్గెట్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. సాక్షి మీడియాలో వచ్చే ప్రతి వార్తకు యాజమాన్యం కూడా బాధ్యత వహించాలని, ఉద్దేశపూర్వకంగా తనపై బురద చల్లుతున్నప్పుడు సంస్థ ఎండీగా ఆమెకు బాధ్యత ఉంటుందని ఆయన వాదిస్తున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడమే కాకుండా, ఒకవేళ ఆ డబ్బు వస్తే దాన్ని అమరావతి రైతులకు విరాళంగా ఇస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తక్షణమే సాక్షి మీడియా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని ఆయన హెచ్చరించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రఘురామ ఇలాగే న్యాయ పోరాటాలు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో, సాక్షి యాజమాన్యంపై నేరుగా కోర్టు మెట్లు ఎక్కడానికి సిద్ధమవ్వడం రాజకీయంగా వైఎస్ జగన్ కుటుంబానికి ఒక సవాల్ లాంటిదేనని చెప్పాలి. మరి ఈ నోటీసులపై వైఎస్ భారతి గానీ, సాక్షి మీడియా ప్రతినిధులు గానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
Rana Daggubati : దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి: ది బిగినింగ్ మరియు బాహుబలి 2: ది కన్క్లూజన్…
YouTuber Na Anvesh : యూట్యూబర్ నా అన్వేష్ కు instagram ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ Meta Platforms షాక్ ఇచ్చింది.…
This website uses cookies.