Home » Andhra Pradesh » Ys Jagan Decided To Appoint Pilli Subash Chandra Bose As Party Rajyasabha Floor
andhra pradesh

Ysrcp : వైసీపీకి రాం రాం చెప్పిన చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి.. ఆయ‌న బాధ్య‌త‌లు ఎవ‌రికి ?

Authored By
Sam C
The Telugu News | Published on: January 31, 2025, 5:00 pm
Advertisement

Ysrcp  : గ‌త కొన్ని నెల‌లుగా ఆంధ్రప్రదేశ్‌ andhra pradesh రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. YCP వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌ని అనుకున్న స‌మయంలో కూట‌మి ప్ర‌భుత్వం భారీ మెజార్టీతో గెల‌వ‌డం రాజ‌కీయాల‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. ఇక వైసీపీ పుంజుకోవాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఒక్కొక్క‌రు పార్టీ నుండి తప్పుకుంటున్నారు. రీసెంట్‌గా vijayasai reddy  విజయసాయి రెడ్డి.. vijayasai reddy తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడం లేదని విజయసాయి రెడ్డి స్పష్టత ఇచ్చారు.

Advertisement

Ysrcp : వైసీపీకి రాం రాం చెప్పిన చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి.. ఆయ‌న బాధ్య‌త‌లు ఎవ‌రికి ?

Ysrcp  బాధ్య‌త‌లు ఎవ‌రికి..

రాజ‌కీయాల‌కి గుడ్ బై చెప్పిన విజ‌య‌సాయి రెడ్డి vijayasai reddy ఎక్కడో హార్టికల్చర్ చేసుకుంటానని ఫోటోలు పెడుతున్నారు. రాజీనామా కూడా ఆమోదం పొందింది కాబట్టి ఢిల్లీలో కనిపించే చాన్స్ లేదు. ఇప్పుడు ఆ బాధ్యతలను పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి తీసుకున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అందుకు కార‌ణం పార్లమెంట్ సమావేశానికి ముందు ఆనవాయితీగా కేంద్రం నిర్వహించే ఆల్ పార్టీ మీటింగ్ కు వైసీపీ తరుపన మిథున్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో తాను ఏపీ కి రావాల్సినవి ఇవ్వాలని కోరానని పోలవరం గురించి ప్రస్తావించానన్నారు. నిజానికి గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత గెలిచిన నలుగురు లోక్ సభ ఎంపీలు… మిగిలిన రాజ్యసభ ఎంపీలకు నాయకుడిగా YV Subba reddy  వైవీ సుబ్బారెడ్డిని ప్రకటించారు. మ‌రోవైపు Pilli subhash chandra bose పుల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కి అప్ప‌గించిన‌ట్టు కూడా టాక్ న‌డుస్తుంది.

Advertisement

సాయిరెడ్డి రాజ్యసభ వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ స్థానాన్ని పార్టీకి చెందిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసున్న‌ట్టు తెలుస్తుంది. సాయిరెడ్డి నిర్ణయం తరువాత వైసీపీ రాజ్యసభ సభ్యులు మరి కొందరు పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. కానీ, ఆ ఎంపీలు తాము పార్టీ మారటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక, అసెంబ్లీ సమావేశాలు.. జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు.కాగా, సాయిరెడ్డి పార్టీకి ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల లో పార్టీ ప్రతినిధిగా పని చేసారు. జగన్ కు ఢిల్లీలో కీలకంగా మారారు. కానీ, సాయిరెడ్డి తాజా నిర్ణయం తో ఇప్పుడు Ys Jagan  జగన్ కీలక నిర్ణయం ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి