Home » Andhra Pradesh » Ys Jagan Gave A Brutal Backlash To Botsa Satyanarayana
andhra pradesh

Botsa Satyanarayana : బొత్స కి దారుణ వెన్నుపోటు పొడిచిన వైఎస్‌ జగన్..!

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: February 16, 2026 6:22 pm
Advertisement

Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వైఎస్ జగన్ Ys Jagan  వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. వైఎస్‌ జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటమే కాకుండా తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా సభకు వెళ్లనీయకుండా ఆపేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసెంబ్లీలో తమ గళం వినిపించే అవకాశం ఉన్నా కేవలం ప్రతిపక్ష హోదా లేదనే నెపంతో సభను బహిష్కరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇలా ఎమ్మెల్యేలను ఆపేసి తనకు బలం ఉన్న మండలిలో పోరాడమని బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించి బెంగళూరు వెళ్ళిపోవడంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. జగన్ తనను ఇబ్బందుల్లోకి నెట్టి పక్కకు తప్పుకున్నాడని బొత్స కూడా అంతర్గతంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండలిలో బొత్స ఒంటరిగా పోరాటం చేస్తున్నా మిగిలిన ఎమ్మెల్సీలు ఆయనకు సరైన మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.

Advertisement

Botsa Satyanarayana : బొత్స కి దారుణ వెన్నుపోటు పొడిచిన వైఎస్‌ జగన్..!

Botsa Satyanarayana అసెంబ్లీలో జగన్ గైర్హాజరు మరియు మండలిలో బొత్స పరిస్థితి

మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే చాలా గందరగోళంగా ఉంది. బొత్స సత్యనారాయణ ఫ్లోర్ లీడర్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా దానికి ప్రభుత్వం వైపు నుండి మంత్రులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఆ సమాధానాలు వినే ఓపిక లేక లేదా వాటిని తిప్పికొట్టే బలం లేక బొత్స సభ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇతర ఎమ్మెల్సీలు కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే వస్తున్నట్లు కనిపిస్తోంది తప్ప సభలో గట్టిగా మాట్లాడటం లేదు. మరోవైపు అసెంబ్లీకి అరవై రోజులు హాజరు కాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని కూడా చర్చ నడుస్తోంది. దీనిపై జగన్ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చని తన వారికి చెబుతున్నట్లు సమాచారం. కూటమికి ఉన్న భారీ సంఖ్యాబలాన్ని చూసి అసెంబ్లీలో అవమానం జరుగుతుందనే భయంతోనే జగన్ సభకు రావడం లేదని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

Advertisement

నిజానికి ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన నాయకులు సభకు రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. జగన్ అసెంబ్లీకి వచ్చి తన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి గట్టిగా నిలబడితే బాగుండేదని సొంత పార్టీలోనే కొందరు అనుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదని మొండిగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల మండలిలో ఉన్న బొత్స సత్యనారాయణ ఒక్కరే అన్నిటికీ సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. జగన్ తన బాధ్యతను బొత్స మీద వేసి జంప్ అయిపోయారని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. అటు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేక ఇటు మండలిలో సమన్వయం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అయోమయంలో ఉంది. ఈ సమావేశాలు ముగిసేలోపు జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ ఇలాగే కొనసాగితే పార్టీ క్యాడర్ లో కూడా నైరాశ్యం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం చేసే విమర్శలను తిప్పికొట్టడానికి సరైన వేదికను వాడుకోకపోవడం వల్ల రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జగన్ వ్యూహం ఫలించి కోర్టుల ద్వారా ఉపశమనం లభిస్తుందా లేక ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారా అన్నది కాలమే నిర్ణయించాలి.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి