
YSR : ఈ టైం లో వైఎస్సార్ CM గా ఉండి ఉంటే ... ఏపీ కి అన్యాయం జరుగుతోందా..?
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్ సిలిండర్ కొనాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుకోవాలి. మన కాకినాడ సముద్ర తీరంలో కృష్ణ గోదావరి బేసిన్ ఉంది. అక్కడి నుంచి లక్షల కోట్ల విలువైన గ్యాస్ బయటకు వస్తోంది. దేశంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపాలు మన దగ్గరే ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటంటే మన దగ్గర నుంచి గ్యాస్ తీసుకువెళ్తున్న రిలయన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలు మనకు మాత్రం తక్కువ ధరకు ఇవ్వడం లేదు. మన కళ్ళ ముందే మన సంపద తరలిపోతుంటే మన అవసరాలకు మాత్రం అధిక ధరలు చెల్లించాల్సి రావడం నిజంగా దౌర్భాగ్యం.
YSR : ఈ టైం లో వైఎస్సార్ CM గా ఉండి ఉంటే … ఏపీ ఎలా ఉండేది..?
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్యాస్ విషయంలో చాలా గట్టిగా పోరాడారు. మన గడ్డ మీద నుంచి గ్యాస్ తీసుకువెళ్తున్నప్పుడు అందులో మన ప్రజలకు వాటా ఉండాలని ఆయన పట్టుబట్టారు. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరిన తర్వాతే గ్యాస్ బయటకు వెళ్లాలని చాలా ధైర్యంగా కేంద్రంతో కూడా చర్చలు జరిపారు. ఆయనకు ఉన్న ఆ పట్టుదల వల్లే అప్పట్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల మీద స్పష్టత ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మన వనరులను కంపెనీలు దోచుకుపోతుంటే అడిగే వాడే లేడు. కేంద్రం కూడా గ్యాస్ ఆదాయాన్ని తన వాటా కింద జమ చేసుకుంటుందే తప్ప అందులో సగం రాష్ట్రానికి ఇవ్వాలన్న ఆలోచన చేయడం లేదు.
నిజానికి మన గ్యాస్ మనకు తక్కువ ధరకు దక్కితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోయేవి. ఇక్కడ పరిశ్రమలు పెరగడానికి వ్యవసాయానికి ఎంతో మేలు జరిగేది. కానీ ఇప్పుడు మన గ్యాస్ పై మనకు హక్కు లేకుండా పోయింది. రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు ఉండి ఉంటే ఈ పాటికి ఢిల్లీ స్థాయిలో గట్టిగా మాట్లాడి మన వాటా మనకు దక్కేలా చేసేవారు. ఇప్పుడు అలాంటి బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే మన సంపద అంతా ఇతరుల పాలవుతోంది. సామాన్యుడు మాత్రం అధిక ధరలతో నలిగిపోతున్నాడు. మన ప్రకృతి ప్రసాదించిన ఈ సంపద మనకు ఉపయోగపడకుండా పోవడం మన రాష్ట్రానికి జరుగుతున్న పెద్ద అన్యాయం. ఇప్పటికైనా నాయకులు మేల్కొని మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
This website uses cookies.