Acharya : ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా మెగాస్టార్ కి జంటగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని మే 13న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.
acharya-versus-pushpa
అయితే తాజాగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. మేకర్స్ ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా వదిలారు. ఇప్పటికే మీడియం బడ్జెట్ సినిమాలన్నీ పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే ఇలా ఆచార్య పోస్ట్ పోన్ అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకి పోటీ అయ్యే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు. అయితే ఆ సమయానికి మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ల ఆచార్య పోటీ కానుందన్న ప్రచారం మొదలైంది. చూడాలి మరి ఆచార్య రిలీజ్ డేట్ మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారో. ఈ సినిమాలు మాత్రమే కాదు పాన్ ఇండియన్ సినిమాలు కూడా కొన్ని ఈ ఏడాది రావడం కష్టమని తెలుస్తోంది.
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
This website uses cookies.