Allu Arjun family trip photos
Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటీవల ‘ పుష్ప 2 ‘ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అల్లు అర్జున్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడంతో వెంటనే కుటుంబంతో కలిసి చిన్న వెకేషన్ ప్లాన్ చేశాడు. ఇక బన్నీ భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి షార్ట్ ట్రిప్ కి వెళ్ళాడు. ప్రస్తుతం రాజస్థాన్ బార్వారా వెకేషన్ లో ఉన్నాడు. బర్వారాలో తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.
Allu Arjun family trip photos
దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇక్కడ చాలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఫ్యామిలీతో చిన్న స్వీట్ బ్రేక్ అని క్యాప్షన్ పెట్టారు. ఇక అల్లు అర్జున్ ఈనెల చివరి ఆఖరిలో పుష్ప 2 సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొననున్నాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో పుష్ప 2 ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
అలాగే ఈ సినిమాను దక్షిణాది భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అలాగే జపనీస్, రష్యన్ భాషలో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. పుష్ప టు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటించింది. రెండవ భాగంలో కూడా రష్మికనే కంటిన్యూ అవుతుంది. అలాగే విలన్ పాత్ర చేసిన అనసూయ కూడా పుష్ప 2లో కంటిన్యూ అవ్వబోతుందని సమాచారం.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.