Home » Entertainment » Heroines Who Are Mothers Before Marriage
Entertainment

Heroines : పెళ్ళికి ముందే ‘ తల్లి ‘ అయిన హీరోయిన్ లు వీళ్ళే !

Authored By
Sam C
The Telugu News | Updated on: October 15, 2022 5:07 pm
Advertisement

Heroines : ట్రెండ్ మారుతుంది. అందుకు అనుగుణంగా కొంద‌రు ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు వ‌స్తున్నాయి. పెళ్లిళ్లు కాక‌ముందే త‌ల్లులు కావ‌డం, సరోగ‌సి ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం వంటివి జ‌రుగుతుంది. ఈ మ‌ధ్య కాలంలో స‌రోగ‌సితో చాలా మంది పిల్ల‌లు కంటున్నారు. రీసెంట్‌గా న‌య‌న‌తార కూడా స‌రోగ‌సి ద్వారా క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డంతో అస‌లు పెళ్లి కాకుండానే పిల్ల‌ల్ని క‌న్న హీరోయిన్స్ ఎవ‌రు అనే దానిపై చ‌ర్చ న‌డుస్తుంది. ముందుగా క‌మ‌ల్ హాస‌న్ – సారిక జంట విష‌యానికి వ‌స్తే.. క‌మ‌ల్‌కి మొత్తం ముగ్గురు భార్య‌లు. గౌత‌మిని క‌మ‌ల్ పెళ్లి చేసుకోక‌పోయినా ఆమెతో ప‌దేళ్ల‌కు పైగానే స‌హ‌జీవ‌నం చేశారు.

Advertisement

అంత‌కు ముందే ఆయ‌న‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. పెళ్లి కాకుండానే శృతి సారిక క‌డుపులో ప‌డింది. ఆమె ప్రెగ్నెంట్‌గా ఉండ‌గా క‌మ‌ల్‌ను పెళ్లాడింది. ఇక ప‌వన్ – రేణూ దేశాయ్ చాలా రోజుల పాటు డేటింగ్ చేశారు. అకీరా నంద‌న్‌, ఆద్య అనే ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక పెళ్లి జ‌రిగింది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం రేణు మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. రేణూకి విడాకులు ఇచ్చాక విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ర‌ణ‌బీర్ క‌పూర్ – అలియా భ‌ట్ జంట ప‌రిస్తితి కూడా. వీరిద్ద‌రు కూడా చాలా రోజ‌లు పాటు డేటింగ్ లో ఉన్నారు. ఇటీవ‌ల వీరిద్ద‌రు స‌రోగ‌సి ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ కూడా ఇటీవ‌ల స‌రోగ‌సితో ప్లాన్ చేయ‌గా, రీసెంట్‌గా పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చారు. లక్ష్మీ మంచు సరోగసీ పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు.

Heroines who are mothers before marriage

Advertisement

Heroines : స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో…

ప్రీతి జింటా కూడా సోషల్ మీడియా ద్వారా సరోగసీ ద్వారా వారికి పిల్లలు కలిగినట్టు ప్రకటించారు. అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు. ప్రియాంక చోప్రా కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు చెప్పారు. షారుక్ ఖాన్, గౌరీ దంపతులు కూడా వారి మూడవ సంతానం కోసం సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.ల్పా శెట్టి దంపతులు కూడా సరోగసీ ద్వారా వారికి ఒక పాప పుట్టినట్టు తెలియ‌జేసిన విష‌యం తెలిసిందే. సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. ఏక్తా కపూర్ కూడా సరోగసీ పద్ధతిని ఆశ్రయించారు.బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసీ పద్ధతి ద్వారా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు.తుషార్ క‌పూర్‌తో పాటు మ‌రి కొంత‌మంది ఇలానే స‌రోగ‌సి ప‌ద్ద‌తిని ఆశ్ర‌యించారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి