Home » Entertainment » Is This The Reason Why The Two Heroines Were Called To The Niharikas Wedding
Entertainment

ఆ ఇద్దరు హీరోయిన్స్ నే నిహారిక పెళ్ళికి పిలవడానికి కారణం ఇదే ..?

Authored By
vamana sai
The Telugu News | Published on: December 9, 2020, 5:29 pm
Advertisement

మెగా డాటర్ .. మెగా బ్రదర్ నాగ బాబు గారాలపట్టి నిహారికా వివాహం ఉదయ్ పూర్ ప్యాలెస్ లో మరికొన్ని గంటల్లో జరగబోతోంది. గత రెండు రోజులుగా మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఉన్నారు. మెహందీ ఫంక్షన్.. సంగీత్ గ్రాండ్ గా జరిగాయి. మొత్తం మెగా హీరోలంతా చేస్తున్న సందడి కి సోషల్ మీడియా షేకవుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్ పెళ్ళి తర్వాత మళ్ళీ అత్యంత వైభవంగా.. ఘనంగా జరుగుతుంది మళ్ళీ నిహారిక వివాహమే అని చెప్పాలి. కోవిడ్ 19 గనక లేకపోయి ఉంటే ఈ సంబరాలు ఆకాశాన్ని తాకేవి.

Advertisement

 

Advertisement

ఇక నిహారిక వివాహానికి అత్యంత సన్నిహితులని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ రెండు రోజుల నుంచి కంప్లీట్ గా మెగా ఫ్యామిలీ తప్ప మిగతా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. అయితే హైదరాబాద్ లో ప్రత్యేకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖలందరి కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఇక నిహారిక వివాహానికి నిన్నా మొన్నటి వరకు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ చాలా మంది హాజరవుతున్నారన్న టాక్ వినిపించింది.

Advertisement

ముఖ్యంగా మెగా హీరోలతో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ , సమంత, శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వాళ్ళకి ఆహ్వానం వెళ్ళిందని .. వారంతా నిహారిక పెళ్ళిలో తళుక్కున మెరవనున్నారన్న వార్తలు వచ్చాయి. కాని కేవలం ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే నిహారికా పెళ్ళికి వచ్చినట్టు సమాచారం. వాళ్ళలో ఒకరు లావణ్య త్రిపాఠి కాగా మరొకరు తెలుగమ్మాయి రీతూవర్మ. ఈ ఇద్దరు నిహారిక కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కావడం వల్లే ఈ ఇద్దరు వచ్చినట్టు.. మిగతా వాళ్ళు హైదరాబాద్ లో జరిగే రిసప్షన్ కి వస్తారని అంటున్నారు.

Advertisement

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి