Taraka Ratna : నందమూరి తారకరత్న చిన్న వయసులో మరణించడం అందరికీ బాధాకరం. అయితే తారకరత్న ఎంతో మంచి మనసు కలవారు. ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయతతో పలకరించే వ్యక్తి కావడంతో ప్రతి ఒక్కరు తారకరత్నతో ఉన్నాను బంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు మురళీమోహన్ తానకరత్నతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. మురళీమోహన్ మాట్లాడుతూ తారకరత్న కు నేను ఎక్కడ కనిపించిన మావయ్య అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు అని అన్నారు. మురళి మోహన్ కు తారక రత్నకు దూరపు బంధుత్వం ఉంది.
అలాగే మురళీమోహన్ కూడా నందమూరి ఫ్యామిలీతో చాలా క్లోజ్ గా ఉంటారు. మురళీమోహన్ తో ఉన్న బంధుత్వం వల్లే తారకరత్న ఆయనను మావయ్య అని పిలిచేవారు. ఇకపోతే తారకరత్న ఇద్దరు దాతలు కూడా గొప్ప పేరు ఉన్నవాళ్లే. ఇటు తాత ఎన్టీఆర్ మహానటుడు, గొప్ప రాజకీయ నేత. అటు అమ్మ వాళ్ళ నాన్న ఉప్పలనేని విశ్వేశ్వర రావు కూడా గొప్ప నిర్మాత. ఈయన ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇందులో అన్ని సినిమాలు సూపర్ హిట్ అయినవే. ఈ పరిచయంతోనే ఎన్టీఆర్ తో బంధుత్వం కలుపుకొని వియ్యంకుడిని చేసుకున్నారు.
ఇకపోతే తారకరత్న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని ఆకస్మాత్తుగా గుండెపోటుకి గురయ్యారు. దీంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. తారకరత్న దాదాపుగా 23 రోజులపాటు చికిత్స తీసుకున్నారు. విదేశీ నుంచి డాక్టర్స్ ను కూడా రప్పించారు. అయినా చివరికి తారకరత్నను కాపాడుకోలేకపోయాం. తీవ్ర గుండెపోటు కారణంగా మెదడు సరిగా పనిచేయకపోవడంతో తారకరత్న మృతి చెందారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.