Actress Hema : తెలుగు నటి హేమ గురించి తెలుసు కదా. తను మీడియా ముందు ఎప్పుడు ఏం మాట్లాడినా అది వివాదానికి దారి తీయాల్సిందే. తాజాగా తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం గుడికి వెళ్తారు. కానీ.. గుడిలోనూ మనకు ప్రశాంతత దొరక్కపోతే ఇక ఎలా ఉంటుంది చెప్పండి. చిరాకు వస్తుంది. తీవ్రమైన కోపం వస్తుంది. అసహనం వేస్తుంది. నటి హేమకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.
ప్రస్తుతం హేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల హేమ.. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. తను గుడికి వచ్చింది అని తెలియగానే మీడియా వాళ్లు అంతా అక్కడికి వెళ్లారు. తన దర్శనం పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతుండగా తను ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయింది. దానికి కారణం అక్కడ ఉన్న ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో హేమ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అయితే..
అమ్మవారిని నేను చూడలేను అని అనుకున్నాను కానీ.. ఆ అమ్మ వారే నన్ను తన దగ్గరికి రప్పించుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది హేమ. ఇంతలో ఓ రిపోర్టర్ కల్పించుకొని.. మీరు టికెట్స్ తీసుకున్నారా? లేదా అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయింది హేమ. ఏంటి గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా? అమ్మవారికి నేను రూ.20 వేల రూపాయల చీరను తీసుకొచ్చాను. రూ.10 వేలు హుండీలో వేశాను. నన్ను టికెట్ గురించి అడుగుతున్నారా మీరు.. నేను ప్రోటోకాల్ ప్రకారమే అన్నీ ఫాలో అవుతున్నాను. నేను దుర్గమ్మ భక్తురాలిని. అమ్మవారి కోసం ఇక్కడికి వచ్చా కానీ.. కాంట్రవర్సీ కోసం కాదు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది హేమ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.