tollywood actress hema in temple video viral
Actress Hema : తెలుగు నటి హేమ గురించి తెలుసు కదా. తను మీడియా ముందు ఎప్పుడు ఏం మాట్లాడినా అది వివాదానికి దారి తీయాల్సిందే. తాజాగా తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలామంది ప్రశాంతత కోసం గుడికి వెళ్తారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం గుడికి వెళ్తారు. కానీ.. గుడిలోనూ మనకు ప్రశాంతత దొరక్కపోతే ఇక ఎలా ఉంటుంది చెప్పండి. చిరాకు వస్తుంది. తీవ్రమైన కోపం వస్తుంది. అసహనం వేస్తుంది. నటి హేమకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.
ప్రస్తుతం హేమకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇటీవల హేమ.. విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంది. తను గుడికి వచ్చింది అని తెలియగానే మీడియా వాళ్లు అంతా అక్కడికి వెళ్లారు. తన దర్శనం పూర్తయ్యాక ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతుండగా తను ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయింది. దానికి కారణం అక్కడ ఉన్న ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో హేమ.. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. అయితే..
tollywood actress hema in temple video viral
అమ్మవారిని నేను చూడలేను అని అనుకున్నాను కానీ.. ఆ అమ్మ వారే నన్ను తన దగ్గరికి రప్పించుకున్నారు అంటూ చెప్పుకొచ్చింది హేమ. ఇంతలో ఓ రిపోర్టర్ కల్పించుకొని.. మీరు టికెట్స్ తీసుకున్నారా? లేదా అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా సీరియస్ అయింది హేమ. ఏంటి గుడిలో కూడా కాంట్రవర్సీ చేయాలనుకుంటున్నారా? అమ్మవారికి నేను రూ.20 వేల రూపాయల చీరను తీసుకొచ్చాను. రూ.10 వేలు హుండీలో వేశాను. నన్ను టికెట్ గురించి అడుగుతున్నారా మీరు.. నేను ప్రోటోకాల్ ప్రకారమే అన్నీ ఫాలో అవుతున్నాను. నేను దుర్గమ్మ భక్తురాలిని. అమ్మవారి కోసం ఇక్కడికి వచ్చా కానీ.. కాంట్రవర్సీ కోసం కాదు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది హేమ. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.