
PM Modi unexpected visit to the commoner shop
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. సమయం, సందర్భం మాత్రమే కాదు ప్రజల మనసులను తాకే సెంటిమెంట్కు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ఆయన రాజకీయ వ్యూహాల్లో కీలకం. సాధారణ ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఆయన చేసే ప్రతి అడుగు ప్రత్యేకంగా కనిపిస్తుంది. దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్లీ ఇలాంటి అనూహ్య రాజకీయ చర్య చేపట్టడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ భారీగా కసరత్తు చేస్తోంది.
PM Modi unexpected visit to the commoner shop
ఆదివారం బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ప్రచారం ముగించుకున్న మోడీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే మధ్యలోనే ఝార్గ్రామ్ నియోజకవర్గంలో రోడ్డు పక్కన అకస్మాత్తుగా తన కాన్వాయ్ను ఆపమని సూచించారు. ఈ నిర్ణయం పూర్తిగా అనూహ్యంగా ఉండడంతో అధికారులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. కారు దిగిన వెంటనే మోడీ సమీపంలోని చిన్న తిండిదుకాణం వైపు నడిచారు. అక్కడ ఉన్న దుకాణదారుడు కూడా ఈ పరిణామంతో షాక్కు గురయ్యాడు. అలసటతో చెమటలు పట్టిన ముఖంతో ఉన్న అతను ఒక్కసారిగా ప్రధాని తన దుకాణం ముందు నిలబడటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మోడీ అతనితో కొద్దిసేపు మాట్లాడి అక్కడే తయారయ్యే ప్రసిద్ధ చిరుతిండి ‘ఝల్మురి’ని తయారు చేయమని అడిగారు.
మోడీ అక్కడ ఉండటం తెలిసిన వెంటనే స్థానిక మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా మోడీ వారిని ఆపుతూ ప్రజలను దగ్గరకు రానిచ్చారు. వారితో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఆయన సింపుల్ స్టైల్ను మరింత బలపరిచింది. ఇంతలో దుకాణదారుడు తయారు చేస్తున్న ఝల్మురిని మోడీ ఆసక్తిగా గమనించారు. ఆ తరువాత ఆ చిరుతిండిని స్వయంగా తీసుకుని తిన్నారు. ముఖ్యంగా దానికి సంబంధించిన డబ్బును తన జేబులోంచి తీసి చెల్లించడం ప్రత్యేకంగా నిలిచింది. మొదట దుకాణదారుడు డబ్బు తీసుకోవడానికి నిరాకరించినా మోడీ పట్టుదలగా చెల్లించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. ఇలాంటి చర్యలు మోడీకి కొత్తవి కావు. గతంలో 2014 ఎన్నికల సమయంలో కూడా ఆయన మధ్యలో టీ దుకాణాల వద్ద ఆగి, సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ప్రచారం సమయంలో మిరపకాయ బజ్జీలు తింటూ కనిపించడం అప్పట్లో వైరల్ అయ్యింది. ఈసారి బెంగాల్లో చేసిన ఈ చిన్న విరామం కూడా రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇకపోతే.. మోడీ తీసుకున్న ఈ సడన్ బ్రేక్ రాజకీయంగా ఎంత మేరకు బీజేపీకి లాభం చేకూరుస్తుందో అన్నది చూడాల్సి ఉంది. కానీ సామాన్యులతో మమేకమయ్యే ఆయన శైలి మాత్రం మరోసారి హైలైట్ అయింది.
Chiranjeevi Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మొదటి…
Best Smartphones : స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త మోడళ్లు విడుదలవుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి…
Mango Farmer : మామిడి పండ్లను పండించే రైతులు మంచి దిగుబడి వస్తే సంతోషిస్తారు. కానీ ఒడిశాకు చెందిన ఓ…
Summer Holidays : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో…
Peddi Movie Day 1 Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా…
Peddi Movie OTT : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన…
CM Revanth Reddy : ఉప్పల్ Uppal ప్రాంత ప్రజలకు మరో శుభవార్త అందింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)…
Farmers : వ్యవసాయ రంగంలో రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలక పథకాలలో…
Chandrababu Pawan Kalyan : తెలంగాణ Telangana రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేచింది. Andhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప…
Parameshwar Reddy : ఉప్పల్ Uppal ప్రాంతంలోని నాలా అభివృద్ధి పనుల నేపథ్యంలో పలువురు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్న వేళ,…
Gold Rate Today : భారతదేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ మారకం విలువ, కేంద్ర…
Bandla Ganesh Vs Prakash Raj : తెలుగు సినీ పరిశ్రమలో నటుడు, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్…
This website uses cookies.