YS Jagan : ఏపీ అసెంబ్లీలో ఇవాళ సీఎం వైఎస్ జగన్.. దివంగత ఎన్టీఆర్ గురించి మాట్లాడారు. ఆయన్ను ఈ సందర్భంగా జగన్ స్మరించుకున్నారు. దివంగత ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో గౌరవం, ఆయనను తక్కువ చేసి మాట్లాడేవారు ఎవరూ మన దేశంలో ఉండరు.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు సందర్భంగా హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చే బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ పై విధంగా స్పందించారు.
అసలు టీడీపీ సభ్యులు అనవసరంగా గొడవలు చేసి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఈ చర్చలో వాళ్లు కూడా పాల్గొంటే బాగుండేది. ఎన్టీఆర్ గారంటే నాకు ఎలాంటి కోపం లేదు. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎన్టీఆర్ కు జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ గౌరవం ఇస్తారు. ఎప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. ఎన్టీఆర్ మీద నాకు ప్రేమ ఉంది. ఆప్యాయతే ఉంది కానీ.. ఆయన్ను అగౌరవ పరిచే కార్యక్రమం ఏనాడూ జరగదు అని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు నోటి వెంట నందమూరి తారక రామారావు అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్ గారెకే నచ్చదు. నిజానికి.. నందమూరి తారక రామారావు అని పలకడం కూడా చంద్రబాబు నాయుడుకు నచ్చదు.
కూతురును ఇచ్చిన అల్లుడే వెన్నుపోటు పొడవడంతో పాటు పలు పరిణామాలతో ఆయన మానసిక క్షోభకు గురయ్యారు. ఆయన ఇంకా చాలాకాలం బతికే ఉండేవారు కానీ.. వెన్నుపోటు వల్ల అకాల మరణం చెందారు. ఎప్పుడు కూడా తాము ఎన్టీఆర్ ను ఒక్క మాట అనలేదు. పాదయాత్రలో మేము ఇదివరకు ఇచ్చిన హామీ ప్రకారమే ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాం.. అని సీఎం జగన్ ఈసందర్భంగా గుర్తు చేశారు. ఎన్టీఆర్ మీద ఎలాంటి కల్మషం లేదు. ఆయన పేరు పెట్టాలని ఎవ్వరూ అడగలేదు. కానీ.. ఆయన మీద ఉన్న గౌరవంతో ఆయన పేరు మీద జిల్లా పెట్టాం. అలాగే బాగా ఆలోచించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ చెప్పారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.