Home » Andhra Pradesh » Fake Liquor Deaths Government Negligence Took Lives Ycp Outraged
andhra pradesh

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

Authored By
Suma
The Telugu News | Published on: January 18, 2026, 1:00 pm
Advertisement

YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మణికుమార్, పుష్పరాజ్ అనే యువకులు నిన్న సాయంత్రం మద్యం సేవించిన అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారని వైసీపీ పేర్కొంది. పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేకపోయాయని విమర్శించింది. ఈ ఘటనను నకిలీ ఎక్స్‌పైర్ అయిన మద్యం వల్ల జరిగిన విషాదంగా వైసీపీ అభివర్ణించింది.

Advertisement

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

YCP : ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం..బాధ్యత తీసుకుంటారా?

ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మరణాలకు బాధ్యత వహిస్తారా అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణ పూర్తిగా విఫలమైందని ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పాలన సాగుతోందని వైసీపీ మండిపడింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన యువకులు భవిష్యత్తు కలలతో జీవిస్తున్న సమయంలో నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని అయినా పాలకులు పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శలు గుప్పించింది.

Advertisement

YCP : టీడీపీ లిక్కర్ సిండికేట్ ఆరోపణలు

నకిలీ మద్యం అమ్మకాల వెనుక టీడీపీకి చెందిన లిక్కర్ సిండికేట్ ఉందని వైసీపీ ఆరోపించింది. ఎక్స్‌పైర్ అయిన మద్యం, నకిలీ మద్యం ప్రజలకు విక్రయిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి విషాదాలు జరుగుతున్నాయని తెలిపింది. నాణ్యత లేని మద్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుని ఉందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యం తయారీ, విక్రయాల వెనుక ఉన్న పెద్దల్ని బయటకు తీసుకురావాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అది విఫలమైతే పాలకులు సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం పాలసీపై తిరిగి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని లేదంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవని హెచ్చరించింది.

 

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి