
YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మణికుమార్, పుష్పరాజ్ అనే యువకులు నిన్న సాయంత్రం మద్యం సేవించిన అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారని వైసీపీ పేర్కొంది. పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేకపోయాయని విమర్శించింది. ఈ ఘటనను నకిలీ ఎక్స్పైర్ అయిన మద్యం వల్ల జరిగిన విషాదంగా వైసీపీ అభివర్ణించింది.
YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం
ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మరణాలకు బాధ్యత వహిస్తారా అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణ పూర్తిగా విఫలమైందని ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పాలన సాగుతోందని వైసీపీ మండిపడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన యువకులు భవిష్యత్తు కలలతో జీవిస్తున్న సమయంలో నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని అయినా పాలకులు పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శలు గుప్పించింది.
నకిలీ మద్యం అమ్మకాల వెనుక టీడీపీకి చెందిన లిక్కర్ సిండికేట్ ఉందని వైసీపీ ఆరోపించింది. ఎక్స్పైర్ అయిన మద్యం, నకిలీ మద్యం ప్రజలకు విక్రయిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి విషాదాలు జరుగుతున్నాయని తెలిపింది. నాణ్యత లేని మద్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుని ఉందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యం తయారీ, విక్రయాల వెనుక ఉన్న పెద్దల్ని బయటకు తీసుకురావాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అది విఫలమైతే పాలకులు సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం పాలసీపై తిరిగి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని లేదంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవని హెచ్చరించింది.
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
Gold Silver Rates 4 March 2026 పెళ్లిళ్ల సీజన్లో, ఈ వేసవి కాలంలో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే పసిడి…
This website uses cookies.