
YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్తో కలిసి మద్యం సేవించిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మణికుమార్, పుష్పరాజ్ అనే యువకులు నిన్న సాయంత్రం మద్యం సేవించిన అనంతరం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారని వైసీపీ పేర్కొంది. పరిస్థితి విషమించడంతో వారిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు నిలువలేకపోయాయని విమర్శించింది. ఈ ఘటనను నకిలీ ఎక్స్పైర్ అయిన మద్యం వల్ల జరిగిన విషాదంగా వైసీపీ అభివర్ణించింది.
YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం
ఈ ఘటనపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మరణాలకు బాధ్యత వహిస్తారా అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణ పూర్తిగా విఫలమైందని ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పాలన సాగుతోందని వైసీపీ మండిపడింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన యువకులు భవిష్యత్తు కలలతో జీవిస్తున్న సమయంలో నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని అయినా పాలకులు పాఠాలు నేర్చుకోవడం లేదని విమర్శలు గుప్పించింది.
నకిలీ మద్యం అమ్మకాల వెనుక టీడీపీకి చెందిన లిక్కర్ సిండికేట్ ఉందని వైసీపీ ఆరోపించింది. ఎక్స్పైర్ అయిన మద్యం, నకిలీ మద్యం ప్రజలకు విక్రయిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేసింది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇటువంటి విషాదాలు జరుగుతున్నాయని తెలిపింది. నాణ్యత లేని మద్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం కళ్లుమూసుకుని ఉందని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. నకిలీ మద్యం తయారీ, విక్రయాల వెనుక ఉన్న పెద్దల్ని బయటకు తీసుకురావాలని మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరింది. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అది విఫలమైతే పాలకులు సమాధానం చెప్పాల్సిందేనని వైసీపీ స్పష్టం చేసింది. రాష్ట్రంలో మద్యం పాలసీపై తిరిగి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని లేదంటే మరిన్ని ప్రాణనష్టాలు తప్పవని హెచ్చరించింది.
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్సభలో కేంద్ర…
This website uses cookies.