
Increase in prices of cooking oil and pulses
Commodity Prices : సామాన్యుల జీవనంపై ధరల భారం రోజు రోజుకు పెరుగుతోంది. నిత్యావసరాల జాబితాలో కీలకమైన వంటనూనె, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వస్తువుల ధరలు భారీగా పెరగడం గమనార్హం. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో షాక్గా మారింది. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు చిన్న ఉద్యోగాలతో జీవనం సాగించే వారికి ఈ పెరుగుదల పెద్ద భారంగా మారుతోంది.
Commodity Prices : సామాన్యులకు భారీ షాక్ .. పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతో తెలుసా ?
వంటింట్లో తప్పనిసరిగా అవసరమయ్యే వంటనూనె ధరలు గత నెలతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.167గా ఉంది. జనవరి ప్రారంభంలో ఇది రూ.150కే లభించేది. అలాగే వేరుశెనగ నూనె ధర ప్రస్తుతం రూ.180కి చేరింది. గత నెలలో ఇది రూ.160గా ఉండగా ఇప్పుడు రూ.20 పెరిగింది. పామాయిల్ విషయానికి వస్తే 850 గ్రాముల ప్యాకెట్ ధర మార్కెట్లో రూ.120గా కొనసాగుతోంది. గతంలో ఇదే ప్యాకెట్ రూ.110కే లభించేది.
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నూనె తయారీ కంపెనీలు మరో మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. లీటర్ ప్యాకెట్లకు బదులుగా 910 గ్రాములు, 850 గ్రాములు, 800 గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తూ వినియోగదారులపై పరోక్ష భారం మోపుతున్నాయి. కంపెనీలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మొత్తం మీద నూనె ధరలు సామాన్యుడి బడ్జెట్ను కుదించేస్తున్నాయి.
వంటనూనెలతో పాటు పప్పుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ కంది పప్పు ప్రస్తుతం మార్కెట్లో రూ.130కి చేరింది. గత నెలలో ఇదే పప్పు రూ.110కే దొరికేది. మినపప్పు ధరలు కూడా కేజీకి రూ.20 మేర పెరిగాయి. వేరుశనగ పలుకుల ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల క్రితం కేజీ రూ.140గా ఉన్న వేరుశనగ పలుకులు ఇప్పుడు రూ.200కి చేరాయి. ఇక ఎండుమిర్చి ధరలు కూడా పెరిగాయి. వారం రోజుల క్రితం కిలో రూ.240గా ఉండగా ఇప్పుడు రూ.300 పలుకుతోంది. పండుగల సీజన్ లేకపోయినా ఈ విధంగా ధరలు పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోజూ ఉపయోగించే ఈ సరుకుల ధరలు పెరగడంతో ఇంటి ఖర్చులు అదుపు తప్పుతున్నాయి.
ఇక కూరగాయల ధరల విషయానికి వస్తే హైదరాబాద్లోని పటాన్చెర్వు మార్కెట్ యార్డులో ప్రస్తుతం కొంత ఊరట కనిపిస్తోంది. కేజీ టమాట రూ.20, వంకాయ రూ.20, బెండకాయ రూ.30గా ఉన్నాయి. క్యాలీఫ్లవర్, క్యారెట్ కేజీకి రూ.30 చొప్పున లభిస్తున్నాయి. బీరకాయ రూ.50, దొండకాయ రూ.60గా ఉన్నాయి. బీన్స్ రూ.30, మిర్చి రూ.60, ఉల్లిపాయ రూ.30, సొరకాయ రూ.20, బీట్రూట్ రూ.30, క్యాప్సికం రూ.50గా ఉన్నాయి. అయితే కూరగాయల్లో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ వంటనూనె మరియు పప్పుల ధరల పెరుగుదల మొత్తం కిచెన్ బడ్జెట్ను కుదించేస్తోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో సామాన్యులపై భారం మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా చెల్లింపులు ఆలస్యం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.…
Vijay- Rashmika : టాలీవుడ్లో ఎన్నాళ్లుగానో చర్చకు దారి తీసిన రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ప్రేమకథ ఇప్పుడు…
RRB : రైల్వే ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశం లభించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)…
Face Recognition : తెలంగాణలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం…
Realme GT 7 : సుమారు రూ.35,000 బడ్జెట్లో శక్తివంతమైన పనితీరు, ఆకట్టుకునే డిస్ప్లే, రోజంతా నిలిచే బ్యాటరీ లైఫ్…
PM Kisan Maandhan : దేశంలోని రైతుల ఆర్థిక భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను…
Ration Card : తెలంగాణ రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త…
Gold and Silver Rate Today 5 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు…
Brahmamudi March 5th 2026 Today Episode : స్టార్ మాలో ప్రసారమవుతున్న టాప్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజుకో…
Karthika Deepam 2 Today 5 March 2026 Episode : త్రినేత్ర.న్యూస్ : స్టార్ మాలో ప్రసారమవుతున్న సూపర్…
Roti Pachdi : మనకు సాధారణంగా బీరకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి లాంటి వంటకాలే ఎక్కువగా తెలుసు. అయితే వాటికంటే…
Sweet Lime Juice : వేసవి కాలం మొదలైతేనే ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, చెమటల ద్వారా…
This website uses cookies.