
Increase in prices of cooking oil and pulses
Commodity Prices : సామాన్యుల జీవనంపై ధరల భారం రోజు రోజుకు పెరుగుతోంది. నిత్యావసరాల జాబితాలో కీలకమైన వంటనూనె, పప్పుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వస్తువుల ధరలు భారీగా పెరగడం గమనార్హం. ఇప్పటికే పెరిగిన కూరగాయల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరో షాక్గా మారింది. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు చిన్న ఉద్యోగాలతో జీవనం సాగించే వారికి ఈ పెరుగుదల పెద్ద భారంగా మారుతోంది.
Commodity Prices : సామాన్యులకు భారీ షాక్ .. పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతో తెలుసా ?
వంటింట్లో తప్పనిసరిగా అవసరమయ్యే వంటనూనె ధరలు గత నెలతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర రూ.167గా ఉంది. జనవరి ప్రారంభంలో ఇది రూ.150కే లభించేది. అలాగే వేరుశెనగ నూనె ధర ప్రస్తుతం రూ.180కి చేరింది. గత నెలలో ఇది రూ.160గా ఉండగా ఇప్పుడు రూ.20 పెరిగింది. పామాయిల్ విషయానికి వస్తే 850 గ్రాముల ప్యాకెట్ ధర మార్కెట్లో రూ.120గా కొనసాగుతోంది. గతంలో ఇదే ప్యాకెట్ రూ.110కే లభించేది.
ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నూనె తయారీ కంపెనీలు మరో మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. లీటర్ ప్యాకెట్లకు బదులుగా 910 గ్రాములు, 850 గ్రాములు, 800 గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తూ వినియోగదారులపై పరోక్ష భారం మోపుతున్నాయి. కంపెనీలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మొత్తం మీద నూనె ధరలు సామాన్యుడి బడ్జెట్ను కుదించేస్తున్నాయి.
వంటనూనెలతో పాటు పప్పుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ కంది పప్పు ప్రస్తుతం మార్కెట్లో రూ.130కి చేరింది. గత నెలలో ఇదే పప్పు రూ.110కే దొరికేది. మినపప్పు ధరలు కూడా కేజీకి రూ.20 మేర పెరిగాయి. వేరుశనగ పలుకుల ధరలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వారం రోజుల క్రితం కేజీ రూ.140గా ఉన్న వేరుశనగ పలుకులు ఇప్పుడు రూ.200కి చేరాయి. ఇక ఎండుమిర్చి ధరలు కూడా పెరిగాయి. వారం రోజుల క్రితం కిలో రూ.240గా ఉండగా ఇప్పుడు రూ.300 పలుకుతోంది. పండుగల సీజన్ లేకపోయినా ఈ విధంగా ధరలు పెరగడం వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోజూ ఉపయోగించే ఈ సరుకుల ధరలు పెరగడంతో ఇంటి ఖర్చులు అదుపు తప్పుతున్నాయి.
ఇక కూరగాయల ధరల విషయానికి వస్తే హైదరాబాద్లోని పటాన్చెర్వు మార్కెట్ యార్డులో ప్రస్తుతం కొంత ఊరట కనిపిస్తోంది. కేజీ టమాట రూ.20, వంకాయ రూ.20, బెండకాయ రూ.30గా ఉన్నాయి. క్యాలీఫ్లవర్, క్యారెట్ కేజీకి రూ.30 చొప్పున లభిస్తున్నాయి. బీరకాయ రూ.50, దొండకాయ రూ.60గా ఉన్నాయి. బీన్స్ రూ.30, మిర్చి రూ.60, ఉల్లిపాయ రూ.30, సొరకాయ రూ.20, బీట్రూట్ రూ.30, క్యాప్సికం రూ.50గా ఉన్నాయి. అయితే కూరగాయల్లో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ వంటనూనె మరియు పప్పుల ధరల పెరుగుదల మొత్తం కిచెన్ బడ్జెట్ను కుదించేస్తోంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో సామాన్యులపై భారం మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
This website uses cookies.