MP Avinash Reddy : 2019 సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ముందు మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రభుత్వం టీడీపీ ఈ హత్య కావాలని వైయస్ జగన్ చేయించారని ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో వైసీపీ వాళ్లు తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేశారు. అయితే ఈ హత్య కేసు విషయంలో వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత న్యాయస్థానాల్లో పోరాడి సీబీఐ చేత ఎంక్వయిరీ చేయించే దిశగా కేసును ముందుకు నడిపించింది. అయితే ఈ కేసులో మొదటి నుండి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రెండుసార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు కూడా అయ్యారు.
ఈ క్రమంలో అవినాష్ రెడ్డి పాత్ర పై తీవ్రస్థాయిలో ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డి కేసు గురించి మీడియా దగ్గర మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ పై నెగిటివ్ కామెంట్లు చేశారు. కేసు విచారణ తప్పు దోవ పట్టించే విధంగా ఉందని అసలు విషయాలు వదిలేసి.. మిగతా విషయాలను పట్టించుకుంటున్నట్లు అవినాష్ రెడ్డి ఆరోపించారు. 2006 నుండి ఓ ముస్లిం మహిళతో ఉండేవారు. 2011వ సంవత్సరంలో ఇస్లాం ప్రకారం ఆయన తన పేరు మార్చుకుని ఆమెను వివాహం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్లకి ఒక బిడ్డ కూడా జన్మించటం జరిగింది. దీంతో
ఆ బిడ్డని వివేకానంద రెడ్డి తన రాజకీయ వారసుడిగా ప్రకటించే అవకాశం ఉందని కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులే హతమార్చినట్లు, ఈ క్రమంలో ఆయన ఉండే ఇంటిలో పత్రాలు కూడా లేకుండా… చేసినట్లు వైయస్ అవినాష్ రెడ్డి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కేసులో ఎంతకైనా ముందుకెళ్తాను. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తా… ఇప్పటివరకు మౌనంగా ఉండటానికి కారణం కుటుంబ పరువు. ఈ హత్య కేసులో ఆయన కుటుంబ సభ్యుల అసలు సూత్రధారులు అంటూ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.