Ys Sharmila : అలాగైతే ముందు వైయస్ సునీతనీ చంపేయాలి… షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!
Ys Sharmila : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతుంది. సీబీఐ ఈ కేసులో కొత్తవారిని విచారిస్తూ ఉండటం సంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు జూన్ 30వ తారీకు లోపు కేసు విచారణ మొత్తం కంప్లీట్ చేయాలని మరి కొంత సమయం ఇవ్వడంతో… వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఎటువైపు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
Ys Sharmila Comments On Ys Viveka Case
అసలు ఆస్తుల కోసమే వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేసింది అయితే ముందు.. వైయస్ సునీతనీ చంపి ఉండాల్సింది. ఎందుకంటే వైయస్ వివేకానంద రెడ్డికి ఒకే ఒక కూతురు సునీత. మొదటి నుండి ఆస్తులు మొత్తం ఆమె పేరట క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఆయన పేరిట అరాకురాస్తులు అవి కూడా.. వైయస్ సునీత పిల్లల పేరిట ఆయన రాయటం జరిగింది. వైయస్ వివేకానంద రెడ్డి ప్రజల మనిషి.
Ys Sharmila Comments On Ys Viveka Case
ఆయన గురించి మా కంటే ఎక్కువగా పులివెందుల మరియు కడప జిల్లా ప్రజలకి బాగా తెలుసు. ఎవరైనా ఏదైనా సమస్య ఆయన దృష్టికి తీసుకువస్తే… దాన్ని పరిష్కరించే మనస్తత్వం కలిగిన వ్యక్తి. బాధితులను కలెక్టర్ ఆఫీస్ లేదా సంబంధిత కార్యాలయానికి స్వయంగా తీసుకెళ్లి పరిష్కరించే మనిషి వివేకానంద రెడ్డి. అటువంటి వైయస్ వివేకానంద రెడ్డి గురించి కొన్ని మీడియా ఛానల్స్ చాలా అనవసరమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయని వ్యక్తిత్వాన్ని దిగజారిస్తున్నాయని వైయస్ షర్మిల మండిపడ్డారు.
