Liquor Bottle : క్వార్టర్ మందు రూ.99.. ఎప్పటి నుండి అమలు కానుందో తెలుసా?
Liquor Bottle : ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. నూతన మద్యం విధానం కూడా రేపటి నుండి అమలు కానుంది. నూతన విధానంలో బ్రాండెండ్ మద్యం అందుబాటులోకి రానుంది. అలాగే క్వార్టర్ రూ.99 లకే నాణ్యమైన మద్యం అందిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16 నుంచి ఏపీవాసులకు నాణ్యమైన మద్యం అందుబాటులోకి రానుంది. మరోవైపు ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడిచాయి. ఇక నూతన మద్యం విధానం ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు మద్యం షాపులు నిర్వహిస్తారు. లిక్కర్ షాపుల లైసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించారు.
99కే క్వార్టర్ బాటిల్ సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోనూ సప్లై చేస్తున్నాయి. కాబట్టి వీటి నుంచి తొలుత 2 లక్షల కేసులు తీసుకోబోతున్నారు. అనంతరం మందుబాబుల స్పందన చూసి తర్వాత స్టాక్ కు ఆర్డర్ పెట్టబోతున్నారు. కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాలకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది. జనాభా ఆధారంగా మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయించాం. లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తాం. రిజర్వుడు దుకాణాలకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు జారీ చేస్తాం. అన్ రిజర్వుడు దుకాణాలకు ప్రతిపాదించే లైసెన్స్ ఫీజుల్లో 50 శాతమే రిజర్వుడు దుకాణాలకు ఉంటుంది అని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి విలేకర్లకు వెల్లడించారు.
Liquor Bottle : క్వార్టర్ మందు రూ.99.. ఎప్పటి నుండి అమలు కానుందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 3396 మద్యం దుకాణాలకు ఏపీ ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం వరకూ కూడా దరఖాస్తులు స్వీకరించారు. ఇక 3,396 మద్యం షాపులకు గానూ 89,882 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తు రుసుము రూపంలో రూ.2 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. ఈ ప్రకారం 89,882 దరఖాస్తులకు గానూ ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 113 లిక్కర్ షాపులకు 5764 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు అనంతపురం జిల్లాలోని 12 లిక్కర్ షాపులకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని ఎక్సైజ్ శాఖ అధికారులు పునఃపరిశీలించాలని భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.