
#image_title
Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం.. చంద్రబాబు అరెస్ట్ అనేది అక్రమం అని.. కావాలని చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా చంద్రబాబు ఫ్యామిలీ రాజకీయాల్లో తలదూర్చలేదు. కానీ.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఇద్దరూ బయటికి వచ్చారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. అలాగే.. బ్రాహ్మణి కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించి రాష్ట్రంలోని మహిళలందరికీ ఏకం చేసి వాళ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎక్కడా నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా చంద్రబాబు అరెస్ట్ పై ఎవరు నిరసన తెలిపినా కూడా వాళ్లపై కేసులు పెట్టి మరీ జైలులో వేస్తున్నారు పోలీసులు.
తాజాగా భువనేశ్వరి, బ్రాహ్మణి చేస్తున్న కార్యక్రమాల్లో ఏపీ మంత్రి రోజా సీరియస్ అయ్యారు. రాష్ట్రం విడిపోయింది.. రాష్ట్రాన్ని బాగు చేస్తారు అనే ఉద్దేశంతో 5 ఏళ్లు.. టీడీపీకి ప్రజలు అవకాశం ఇస్తే మీరు చేసింది ఏంటి.. ఐదేళ్లలో యువత డబ్బును దోచుకున్నారు. ఇప్పుడు సాక్ష్యాదారాలతో సహా దొరికారు. యువత డబ్బును కూడా వదలని చంద్రబాబును అరెస్ట్ చేస్తే సిగ్గు లేకుండా వాళ్ల భార్య, వాళ్ల కోడలు గంట కొట్టండి.. జగన్ మోహన్ రెడ్డి సైకో.. ఆయనకు బుద్ధి చెప్పండి అంటున్నారు. బ్రాహ్మణి గారు మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ.. ఈ రాష్ట్రంలోనే పెద్ద సైకో ఎవరైనా ఉన్నారు అంటే.. అది మీ నాన్న బాలకృష్ణ గారు, మీ మామ చంద్రబాబు గారు. మీ తాతని అంటే.. మీ నాన్నకి మీ మామకి అడ్రస్ ఇచ్చి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేసి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ అంటూ రోజా దుయ్యబట్టారు.
#image_title
జగన్ మీద ఇంకో మాట మాట్లాడితే మర్యాద దక్కదు. ఇన్ని రోజులు నువ్వు రాజకీయాల గురించి మాట్లాడలేదు కాబట్టి ఎవ్వరూ నిన్ను పట్టించుకోలేదు. కానీ.. చంద్రబాబు తప్పును మీరు కప్పిపుచ్చుతూ.. అందరినీ మభ్య పెట్టాలని, దిగజారుడు మీటింగ్స్ పెట్టి, ట్వీట్స్ పెట్టి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించి.. హైదరాబాద్ కు పరిమితం అయిన వీళ్లను.. మళ్లీ ఏపీకి రాకుండా తరిమికొట్టాలి. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్నవి 11 మెడికల్ కాలేజీలు మాత్రమే. కానీ.. ఇప్పుడు జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వైద్య శాఖలో ఆరోగ్య ప్రదాతలు ఉన్నారో.. వాళ్లలో 50 వేల వేకెన్సీలను ఫిల్ చేసి అన్ని చోట్ల డాక్టర్లు, మెడిసిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి ఈరోజు ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని మంత్రి రోజా కొనియాడారు.
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
This website uses cookies.