Chandrababu : 2024 లో చంద్రబాబు చస్తాడు.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారు.. అంటూ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన తాజాగా వైసీపీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. చంద్రబాబు మొన్నటి వరకు బస్సు యాత్ర చేశారు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు అంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు.
ఇక.. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడంటూ హేళన చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీలో తిరుగుతున్నారని అన్నారు. మరోవైపు రాజమండ్రి జైలులోనే చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబు 2024 లో చస్తారని.. ఆ తర్వాత మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని వైసీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు ఫినిష్.. ఎంత సేపు.. గన్ మెన్స్, జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసేస్తే ఆయన ఫినిష్ అంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా గోరంట్ల కూడా చంద్రబాబుపై డైరెక్టుగా మాట్లాడటంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వీళ్లు మాట్లాడటమే కాదు.. చంద్రబాబుకు ఏదైనా హానీ తలపెట్టినా తలపెడతారు అని చంద్రబాబు కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఏది ఏమైనా.. పబ్లిక్ గా వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.