mp gorantla madhav comments on chandrababu
Chandrababu : 2024 లో చంద్రబాబు చస్తాడు.. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారు.. అంటూ వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన ఓ ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన తాజాగా వైసీపీ సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. చంద్రబాబు మొన్నటి వరకు బస్సు యాత్ర చేశారు. ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారు అంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు.
ఇక.. నారా లోకేష్ గురించి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడంటూ హేళన చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీలో తిరుగుతున్నారని అన్నారు. మరోవైపు రాజమండ్రి జైలులోనే చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చంద్రబాబు 2024 లో చస్తారని.. ఆ తర్వాత మళ్లీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని గోరంట్ల చేసిన వ్యాఖ్యలతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని వైసీపీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు ఫినిష్.. ఎంత సేపు.. గన్ మెన్స్, జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసేస్తే ఆయన ఫినిష్ అంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాజాగా గోరంట్ల కూడా చంద్రబాబుపై డైరెక్టుగా మాట్లాడటంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వీళ్లు మాట్లాడటమే కాదు.. చంద్రబాబుకు ఏదైనా హానీ తలపెట్టినా తలపెడతారు అని చంద్రబాబు కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఏది ఏమైనా.. పబ్లిక్ గా వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…
This website uses cookies.