Home » News » Ipl 2025 Postponed Will India Vs Pakistan Tensions
News

IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 10, 2025, 5:00 pm
Advertisement

IPL 2025 : భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం దాడులు ప్రతి దాడుల నేపథ్యంలో ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌లు ఎప్పుడు జ‌రుగుతాయి, ఎక్క‌డ జ‌రుగుతాయి అన్న దానిపై అంద‌రిలో సందేహాలు నెల‌కొన్నాయి. ఇదిలా ఉండగా, టోర్నమెంట్ ప్రారంభానికి సంబంధించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పుడు ఒక పెద్ద ప్రకటన చేశారు.

Advertisement

IPL 2025 : యుద్ధం వ‌ల‌న ఆగిన ఐపీఎల్‌.. తిరిగి మొద‌ల‌య్యేది ఎప్పుడు అంటే..!

IPL 2025 : తిరిగి ఎప్పుడంటే..

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఐపీఎల్ 2025 ప్రస్తుతం ఒక వారం వాయిదా పడుతోందని అన్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత, భారత ప్రభుత్వంతో సంప్రదించి, భాగస్వాములు, అన్ని ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలతో మాట్లాడిన తర్వాత, కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన అన్నారు.

Advertisement

గురువారం జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోగా,ఆ రోజు ఒకవైపు అభిమానులను మైదానం నుంచి బయటకు పంపించేశారు. ఆటగాళ్లను వీలైనంత త్వరగా వారి హోటళ్లకు తిరిగి పంపించారు. తరువాత, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ సింగ్ ధుమల్ మాట్లాడుతూ, మైదానంలో తొక్కిసలాట లాంటి సంఘటనను నివారించడానికి విద్యుత్తు అంతరాయం మరియు ఫ్లడ్‌లైట్ వైఫల్యాన్ని ఒక సాకుగా ఉపయోగించుకున్నారని వెల్లడించారు.ఈ సీజ‌న్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు జరిగాయి. అయితే పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను తిరిగి షెడ్యూల్ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టం లేదు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి