Home » News » Chandrababu And Kcr Call Over Amaravati
News

Chandrababu and KCR : రాజ్యసభ లో సపోర్ట్ చేసినందుకు థాంక్స్ .. KCR కి చంద్రబాబు ఫోన్ ?

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: April 3, 2026 12:05 pm

Chandrababu and KCR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు, రాజ్యసభలో కూడా ఏకగ్రీవంగా పాస్ అవ్వడం విశేషం. అయితే ఈ ప్రక్రియలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం. రాజ్యసభలో అమరావతి బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ బేషరతుగా మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Chandrababu and KCR : రాజ్యసభ లో సపోర్ట్ చేసినందుకు థాంక్స్ .. KCR కి చంద్రబాబు ఫోన్ ?

రాజ్యసభలో బిల్లుపై చర్చ జరిగిన సమయంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. తాము అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ స్వయంగా హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని ప్రకటించి బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈ అనూహ్య పరిణామంతో ఖంగుతిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రాజధాని విషయంలో దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Chandrababu and KCR : అమరావతికి దక్కిన చట్టబద్ధత

రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 12 ఏళ్లకు అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించింది. 2014 విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఆ గడువు ముగియడంతో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం సవరణ బిల్లు తెచ్చింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పొరుగు రాష్ట్ర పార్టీ అయిన బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ కు ఫోన్ చేసి థాంక్స్ చెప్పారని ప్రచారం జరుగుతోంది.

రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత పెరగడానికి, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఇలాంటి నిర్ణయాలు అవసరమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి పార్లమెంటు ఆమోదంతో అమరావతిపై ఉన్న అన్ని న్యాయపరమైన చిక్కులు తొలగిపోయినట్లయింది. చంద్రబాబు వ్యూహం పలించి రాజధాని నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో అటు అమరావతి రైతులు, ఇటు కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న నేతలు రాజధాని విషయంలో ఒకే తాటిపైకి రావడం విశేషం.

 

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Latest Posts

Related Posts

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి