
Revanth Reddy : రేవంత్ మరికాస్త సీరియస్గా దృష్టి సారించాల్సిందేనా?
Revanth Reddy : ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అన్న అంశంపై ఎల్లప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాజీ సీఎం కేసీఆర్ సర్కారునే తీసుకుంటే పదేళ్లు పాలనా వ్యవహారాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవి. ఏ నిర్ణయమైనా కేసీఆర్ మాటే ఫైనల్. లేదంటే షాడో సీఎంగా వ్యవహరించిన ఆయన కుమారుడు కేటీఆర్ మాటే శాసనంగా కొనసాగింది. చివరకు సీఎస్ సైతం వారి ఆదేశాలకు తగ్గట్లు నడుచుకోవటమే తప్పించి, సొంత నిర్ణయాలకు అవకాశమే లేకుండా ఉండే. సీఎస్ పరిస్థితే ఇలా ఉంటే సీనియర్ సివిల్ సర్వీస్ అధికారుల సంగతిని చెప్పనక్కరలేదు. ఇగ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన విషయానికి వస్తే స్వేచ్చ కాస్త ఎక్కువైందనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. సహజంగానే కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను బాహాటంగానే వెల్లడిస్తుంటారు. రేవంత్ సర్కారు పాలనలోనూ అది నడుస్తోందన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ పదేళ్ల సర్కారులో నిర్ణయం ఏదైనా.. అయితే గులాబీ బాస్ది.. లేదంటే జూనియర్ బాస్దే. కానీ రేవంత్ సర్కారులో అలాంటి పరిస్థితి లేదు. సీఎంకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే సీనియర్ అధికారులకు కొదవ లేకుండా పోతుంది. అలాంటి వారి విషయంలో చర్యలు తీసుకోవటానికి సీఎం రేవంత్ కు ఉండే పరిమితులు ఇబ్బంది మారుతున్నట్లు సమాచారం.
Revanth Reddy : రేవంత్ మరికాస్త సీరియస్గా దృష్టి సారించాల్సిందేనా?
తాజాగా వెలుగు చూసిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్సెస్ సీఎంఓ ఉండటమే దీనికి కారణం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తీసుకున్న నిర్ణయాన్ని సీఎంఓ అధికారి రచ్చ చేయటం ఏమిటి అని ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. అధికారిక ఉత్తర్వుల్లో విషయం బయటకు వచ్చేలా చేయడ దేనికి నిదర్శనం అని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే తెలంగాణలో ఎకో టూరిజంను డెవలప్ చేయటానికి వీలుగా విధానాల్ని డిసైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
దీని కోసం టూరిజం అధికారులు ఇతర రాష్ట్రాలు.. దేశాల్లో పర్యటించి ఎకో టూరిజం డెవలప్ మెంట్ కోసం వారు చేస్తున్న చర్యలపై అధ్యయనం చేయాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం సీఎంవోలో అటవీ శాఖ బాధ్యతలు చూసే అధికారి (చంద్రశేఖర్ రెడ్డి)తో పాటు ఆ శాఖకు సంబంధించిన మరికొందరిని ఎంపిక చేశారు. వీరంతా ఐఎఫ్ఎస్ అధికారులే. వీరంతా కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించి అక్కడ ఎకో టూరిజం మీద అధ్యయనం చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 18న సీఎస్ శాంతకుమారి ఒక జీఓ జారీ చేవారు.
ఈ టూర్ కు అయ్యే ఖర్చును తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు ఆయా దేశాల్లో పర్యటించిన టీమ్ రాష్ట్రానికి తిరిగి వచ్చింది. అయితే తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళ్తారంటూ పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ మెమో జారీ చేశారు. సీఎంవోలోని చంద్రశేఖర్ మినహా మిగిలిన వారంతా తన కింద పని చేసే వారని.. తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళతారంటూ వివరణ కోరుతూ మెమో జారీ చేయటం సంచలనంగా మారింది. అధికారులు విదేశాల్లో ఉండగానే ఈ మెమోలు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి.. సీఎస్ అవగాహనతో తీసుకున్న నిర్ణయంపై ఇలా స్పందించటం ఏమిటి? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. అధికారుల ఇలాంటి రచ్చలపై సీఎం రేవంత్ రెడ్డి మరికాస్త సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Software Engineer : సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
This website uses cookies.