Categories: NewsTelangana

Revanth Reddy : రేవంత్ మ‌రికాస్త సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిందేనా?

Revanth Reddy : ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అన్న అంశంపై ఎల్ల‌ప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాజీ సీఎం కేసీఆర్ సర్కారునే తీసుకుంటే పదేళ్లు పాల‌నా వ్యవహారాల‌న్నీ కేంద్రీకృతంగా ఉండేవి. ఏ నిర్ణయమైనా కేసీఆర్ మాటే ఫైన‌ల్‌. లేదంటే షాడో సీఎంగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న కుమారుడు కేటీఆర్ మాటే శాస‌నంగా కొన‌సాగింది. చివరకు సీఎస్ సైతం వారి ఆదేశాలకు తగ్గట్లు నడుచుకోవటమే తప్పించి, సొంత నిర్ణయాలకు అవకాశమే లేకుండా ఉండే. సీఎస్ పరిస్థితే ఇలా ఉంటే సీనియర్ సివిల్ స‌ర్వీస్‌ అధికారుల సంగతిని చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఇగ ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న విష‌యానికి వ‌స్తే స్వేచ్చ కాస్త ఎక్కువైంద‌నే అభిప్రాయాలు విన‌వ‌స్తున్నాయి. స‌హ‌జంగానే కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌భుత్వ విధానాల‌పై త‌మ అభిప్రాయాల‌ను బాహాటంగానే వెల్ల‌డిస్తుంటారు. రేవంత్ సర్కారు పాలనలోనూ అది నడుస్తోందన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ పదేళ్ల సర్కారులో నిర్ణయం ఏదైనా.. అయితే గులాబీ బాస్‌ది.. లేదంటే జూనియర్ బాస్‌దే. కానీ రేవంత్ సర్కారులో అలాంటి పరిస్థితి లేదు. సీఎంకు చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే సీనియర్ అధికారులకు కొదవ లేకుండా పోతుంది. అలాంటి వారి విషయంలో చర్యలు తీసుకోవటానికి సీఎం రేవంత్ కు ఉండే పరిమితులు ఇబ్బంది మారుతున్న‌ట్లు స‌మాచారం.

Revanth Reddy : రేవంత్ మ‌రికాస్త సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిందేనా?

తాజాగా వెలుగు చూసిన ఉదంతమే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వర్సెస్ సీఎంఓ ఉండటమే దీనికి కారణం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో తీసుకున్న నిర్ణయాన్ని సీఎంఓ అధికారి రచ్చ చేయటం ఏమిటి అని ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మౌతున్నాయి. అధికారిక ఉత్తర్వుల్లో విషయం బయటకు వచ్చేలా చేయడ‌ దేనికి నిదర్శనం అని ప్రశ్నిస్తున్నారు. అసలేం జరిగిందంటే తెలంగాణలో ఎకో టూరిజంను డెవలప్ చేయటానికి వీలుగా విధానాల్ని డిసైడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

దీని కోసం టూరిజం అధికారులు ఇతర రాష్ట్రాలు.. దేశాల్లో పర్యటించి ఎకో టూరిజం డెవలప్ మెంట్ కోసం వారు చేస్తున్న చర్యలపై అధ్యయనం చేయాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం సీఎంవోలో అటవీ శాఖ బాధ్యతలు చూసే అధికారి (చంద్రశేఖర్ రెడ్డి)తో పాటు ఆ శాఖకు సంబంధించిన మరికొందరిని ఎంపిక చేశారు. వీరంతా ఐఎఫ్ఎస్ అధికారులే. వీరంతా కెన్యా, టాంజానియా దేశాల్లో పర్యటించి అక్కడ ఎకో టూరిజం మీద అధ్యయనం చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 18న సీఎస్ శాంతకుమారి ఒక జీఓ జారీ చేవారు.

Revanth Reddy అధికారుల విదేశీ ప‌ర్య‌ట‌నతో వెలుగులోకి విభేదాలు

ఈ టూర్ కు అయ్యే ఖర్చును తెలంగాణ‌ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి 27 వరకు ఆయా దేశాల్లో పర్యటించిన టీమ్‌ రాష్ట్రానికి తిరిగి వచ్చింది. అయితే తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళ్తారంటూ పీసీసీ ఎఫ్ డోబ్రియాల్ మెమో జారీ చేశారు. సీఎంవోలోని చంద్రశేఖర్ మినహా మిగిలిన వారంతా తన కింద పని చేసే వారని.. తనకు చెప్పకుండా విదేశాలకు ఎలా వెళతారంటూ వివరణ కోరుతూ మెమో జారీ చేయటం సంచలనంగా మారింది. అధికారులు విదేశాల్లో ఉండగానే ఈ మెమోలు జారీ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి.. సీఎస్ అవగాహనతో తీసుకున్న నిర్ణయంపై ఇలా స్పందించటం ఏమిటి? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. అధికారుల‌ ఇలాంటి రచ్చలపై సీఎం రేవంత్ రెడ్డి మరికాస్త సీరియ‌స్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

4 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

5 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

6 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

7 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

8 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

9 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

10 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

11 hours ago