Home » News » Good News For Farmers Kisan And Rythu Bharosa Schemes Money Deposit On This Time
News

PM kisan : తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… ఈసారి 13500 రైతుల ఖాతాల్లోకి ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 22, 2024, 6:00 pm
Advertisement

pm kisan : ప్రధాని పీఎం కిసాన్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం 2019 లో ప్రారంభించడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు వ్యవసాయ కార్యక్రమాలను కొనసాగించడం మరియు వారి జీవనోపాధిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన 17వ విడత కోసం దేశవ్యాప్తంగా రైతులతోపాటు ఏపీ , తెలంగాణ రైతులకు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 16వ విడత డబ్బులు ఫిబ్రవరి 2024లో విడుదల కాగా ఈ పథకం ద్వారా రైతులు ప్రతి 4 నెలలకు ఒకసారి నిధులను పొందుతున్నారు. అలా ప్రతి విడతకు రూ.2000 చొప్పున ఏడాదికి 3 విడతలుగా రూ.6000 రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి.

Advertisement

ఇక పీఎం కిసాన్ డబ్బులు 17వ విడత మే 2024 చివరినాటికి లేదా జూన్ ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు. కాని ఇప్పటివరకు పీఎం కిసాన్ 16 విడతలు విడుదలయ్యింది. ఇక 17వ విడత కోసం ఈ కేవైసీ పొందడం అవసరం అని తెలుస్తుంది.కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు సంవత్సరంలో 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ.10,000 అందజేస్తుంది. అలాగే వానాకాలం సీజన్ లో రైతు భరోసా కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.15000 అందించనుంది. అంటే సంవత్సరానికి రైతుల ఖాతాలో 21 వేలు జమ కానున్నాయన్నమాట.

PM kisan : తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త… ఈసారి 13500 రైతుల ఖాతాల్లోకి ..!

Advertisement

అయితే పీఎం కిసాన్ నిధులు జూన్ మొదటి వారంలో 2000 జమ అయిన తర్వాత వానాకాలం సీజన్ లో ఎకరానికి 7500 తెలంగాణ రైతుల ఖాతాలో జమ కానున్నాయి.అలా రైతు లకు ఒకేసారి 9500 పెట్టుబడి సాయం కింద , అందనున్నాయి.అయితే రాబోయే విడుదలకు సంబంధించిన సమాచారం కోసం రైతులు పీఎం కిసాన్ నిధి pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఇక వాటితో పాటుగా కేవైసీ ద్వారా డబ్బులు జమ కాని రైతులు ఈ విడతలో మొత్తం డబ్బులను పొందే అవకాశం ఉంది. కాబ్బటి ఈ కేవైసీని ఏ రైతులైతే పూర్తి చేశారో వారు మాత్రమే డబ్బును పొందుతారు. అంటే పీఎం కిసాన్ మొత్తం 6000 ఇక వాటితో పాటు రైతు భరోసా 7500 మొత్తాన్ని పొందవచ్చు.అంటే రూ.13,500 రైతుల అకౌంట్లో జమ కానున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి