
Telangana government gives good news to farmers
Farmers : తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కీలక చర్యలు చేపడుతోంది. రైతులకు ఇబ్బందులు లేకుండా సాగు సాఫీగా సాగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ఖరీఫ్ పంటల సాగు, ఎరువుల సరఫరా, రైతులకు సబ్సిడీల పంపిణీ వంటి అంశాలపై మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వ్యవసాయ రంగంలో పారదర్శకత పెంచే చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
Farmers : రైతులకు శుభవార్త .. ఇక పై ఆ సబ్సిడీ కంపెనీలకు వెళ్లేది లేదు .. నేరుగా రైతుల ఖాతాల్లో జామ ..!
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ప్రభుత్వం కీలక మార్పు తీసుకొచ్చింది. గతంలో రైతులు ట్రాక్టర్లు లేదా ఇతర వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసినప్పుడు అందించే 40 శాతం సబ్సిడీ నేరుగా యంత్రాల కంపెనీలకు చెల్లించబడేది. ఈ విధానంలో నిధుల వినియోగంలో పారదర్శకతపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేయాలని నిర్ణయించింది. ఈ మార్పుతో రైతులు తమ అవసరాలకు తగిన యంత్రాలను స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం పొందుతారు. అంతేకాకుండా మధ్యవర్తులు లేదా దళారుల ప్రభావం తగ్గి, ప్రభుత్వ నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరేలా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60.60 లక్షల హెక్టార్లలో పంటలు సాగవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగు విస్తీర్ణం పెరగనున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా విత్తనాలు వేసే సమయంలో ఎరువుల కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే అవసరమైన బఫర్ స్టాక్ను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని సూచించారు. అలాగే నేల సారాన్ని పెంచేందుకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ విత్తనాలను ఏప్రిల్ నెలాఖరులోపు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా పంటల మార్పిడి, సేంద్రియ విధానాలను కూడా ప్రోత్సహించాలని సూచించారు.
వ్యవసాయ శాఖను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికల ద్వారా రైతులకు పంటలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు నేరుగా రైతుల పొలాలకు వెళ్లి పంటల నిర్వహణపై సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో డిజిటల్ క్రాప్ సర్వే వ్యవస్థను కూడా మరింత విస్తరించనున్నారు. ఈ సర్వే ద్వారా ఏ జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతోందో ఖచ్చితమైన సమాచారం సేకరించబడుతుంది. ఆ వివరాల ఆధారంగా మార్కెటింగ్ సదుపాయాలు, నిల్వ కేంద్రాలు మరియు రైతులకు అవసరమైన ఇతర సౌకర్యాలను సమయానికి కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ కొత్త విధానాలు అమల్లోకి రావడంతో వ్యవసాయం మరింత లాభసాటిగా మారడమే కాకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో అందేలా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారు.
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
This website uses cookies.