ap politics are based at visakhapatnam
Vizag : వైజాగ్ ను అంత తక్కువ అంచనా వేయొద్దు. ఏదో ఉత్తరాంధ్ర కదా. ఎక్కడో మూలకు ఉంటుంది కదా అని తీసిపారేస్తే రాత్రికి రాత్రే రాజకీయాలు మారిపోతాయి. అందుకే వైజాగ్ ను తక్కువ అంచనా వేయకూడదని ఏపీలోని ప్రధాన పార్టీలకు అర్థం అయినట్టుంది. అందుకే ఇప్పుడు వైజాగ్ కేంద్రంగా రాజకీయాలను నడిపిస్తున్నాయి. అందుకే కదా వైజాగ్ ను పరిపాలన రాజధాని చేసి త్వరలోనే అక్కడి నుంచి పాలన సాగించాలని సీఎం జగన్ తహతహలాడతున్నారు.
గతంలో కూడా వైజాగ్ ను అంతగా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకే వైజాగ్ ప్రజలు అన్ని పార్టీల మీద కాస్త గుర్రుగానే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే సీఎం అభ్యర్థిని డిసైడ్ చేసేదే ఉత్తరాంధ్ర ప్రజలు. అందుకే వాళ్లు ఎటు మొగ్గు చూపితే ఆ పార్టీకే గెలిచే చాన్స్ ఉంటుంది. వచ్చే సంవత్సరమే ఎన్నికలు. అందుకే ఇప్పటి నుంచే ఉత్తరాంధ్ర ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు. అందుకే సీఎం జగన్ కూడా వైజాగ్ నుంచి పాలన సాగించాలని.. వచ్చే దసరా నుంచే ఆయన వైజాగ్ నుంచి పాలన ప్రారంభించే అవకాశం ఉంది.
ap politics are based at visakhapatnam
ఇక.. ప్రతిపక్ష పార్టీలు కూడా వైజాగ్ మీద దృష్టి సారించాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పరిపాలన వికేంద్రీకరణ అని ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుండటంతో.. ప్రతిపక్షాలు కూడా పాలనా వికేంద్రీకరణకు మద్దతు తెలుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా తన వారాహి యాత్ర మూడో విడత వైజాగ్ కేంద్రంగా జరగనుంది. చంద్రబాబు కూడా వైజాగ్ పై దృష్టి సారించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక్కసారిగా అందరి చూపు వైజాగ్ మీదికి మళ్లడంతో వైజాగ్ ప్రజలు ఎవరి వైపు నిలిస్తే వాళ్లకే సీఎం పీఠం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
This website uses cookies.