Bhuvaneswari – Brahmani : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత చాలామంది నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారని అనుకున్నారు. నిజానికి.. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో నారా లోకేష్ కూడా నిందితుడిగా ఉన్నాడు. దీంతో నారా లోకేష్ అరెస్ట్ కూడా ఖాయం అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత టీడీపీ ముఖ్యనేతలను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఎందుకంటే.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ కంటే కూడా ఆ ఉచ్చు భువనేశ్వరి, బ్రాహ్మణిలకు చుట్టుకుంటోంది. అసలు ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో భువనేశ్వరి, బ్రాహ్మణికి ఏంటి సంబంధం. ఈ అత్తాకోడళ్లు ఈ స్కామ్ లో ఎలా ఇరుక్కున్నారు అంటారా? పదండి వివరంగా తెలుసుకుందాం.
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో హెరిటేజ్ సంస్థ పేరును అధికారులు యాడ్ చేశారు. అంటే.. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరిందనే వాదన ప్రస్తుతం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం టీడీపీ నేతల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయింది. సీఐడీ అధికారులు కూడా ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ దర్యాప్తులో హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరినట్టు తేలితే మాత్రం ఖచ్చితంగా ఆ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఇద్దరూ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. హెరిటేజ్ సంస్థకు వైస్ చైర్ పర్సన్, ఎండీగా నారా భువనేశ్వరి ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బ్రాహ్మణి ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ6గా హెరిటేజ్ సంస్థను అధికారులు చేర్చారు. రాజకీయంగా చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తారని అంతా ఊహించారు కానీ.. ఇప్పుడు నారా ఫ్యామిలీ మొత్తం కేసులోకి వస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని అనుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో తన యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు.
ఈనెల 29న యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని నారా లోకేష్ భావిస్తున్నారు. కానీ.. ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాక.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లోనే ఆయన్ను అరెస్ట్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కు నిందితుడిగా ఉన్నాడు. అలాగే హెరిటేజ్ సంస్థ కూడా ఇందులోకి రావడంతో ఈ కేసు రకరకాల మలుపులు తీసుకుంది. మరి.. లోకేష్ ను ముందు అరెస్ట్ చేస్తారా? లేక భువనేశ్వరి, బ్రాహ్మణిని కూడా విచారణకు పిలుస్తారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.