Categories: andhra pradeshNews

Chandrababu : బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కి సుప్రీం కోర్టు షాక్ ?

Advertisement
Advertisement

Chandrababu  : తిరుమల లడ్డూ వివాదం చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చ, ఆరోపణలు చూస్తుంటే అసలు ఇక్కడ భక్తి కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోందని ప్రముఖ న్యాయవాది, ఇటీవల జనసేన కి రాజీనామా చేసిన రజిని రీసెంట్ గా తన ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఒకవైపు లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని, అందులో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ తయారు చేస్తున్న పెరుగు మీద కూడా తీవ్రమైన ఆరోపణలు రావడం గమనార్హం. హెరిటేజ్ సంస్థ విక్రయిస్తున్న పెరుగులో అసలు పాల శాతమే లేదని, అది అసలు పెరుగే కాదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ధారించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి సదరు సంస్థకు లక్ష రూపాయల పెనాల్టీ కూడా వేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రం ఏంటంటే, తమ నాణ్యతను నిరూపించుకోకుండా ఆ సంస్థ యాజమాన్యం వెంటనే జరిమానా కట్టేసి తప్పును ఒప్పుకున్నట్లు రజిని వివరించారు. అంటే ఒకవైపు దేవుడి ప్రసాదం విషయంలో కల్తీ జరిగిందని గగ్గోలు పెడుతున్న వారు, తమ సొంత సంస్థలో జరుగుతున్న నాణ్యత లోపాల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీని మీద సుప్రీం లో తాను కేసు పెట్టె ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

Chandrababu : బిగ్ బ్రేకింగ్.. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కి సుప్రీం కోర్టు షాక్ ?

ఇక తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు కూడా ఇప్పుడు ప్రభుత్వం వైఖరిని ఎండగడుతున్నాయి. ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి బాగోలేదని వాటిని వెనక్కి పంపించినప్పుడు, అసలు వాడనే లేని నెయ్యి గురించి అంత దారుణమైన పదజాలం ఎందుకు వాడారని కోర్టు అడిగిన విషయాన్ని రజిని గుర్తుచేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. నిజంగా నాణ్యత లోపం ఉంటే అది అధికారుల వైఫల్యం అవుతుంది కానీ, దానికి రాజకీయ రంగు పూసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. తిరుమలలో పని చేసే అధికారులు స్వామివారి మీద భక్తితో ఉంటారని, అక్కడ ప్రతి ఒక్కరి రింగ్‌టోన్ కూడా ఓం నమో వెంకటేశాయ అని ఉంటుందని, అలాంటి చోట ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని నమ్మడం కష్టమని ఆమె అన్నారు. ఏదైనా తప్పు జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి కానీ, ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం వల్ల దేశవ్యాప్తంగా తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Chandrababu : లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు

రాష్ట్రంలో అసలైన సమస్యలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి దారుణంగా తయారైందని రజిని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మేమే పూర్తి చేస్తాం అని చెప్పిన వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పనులన్నీ ఆపేశారని, దీనికి కారణం నిర్మాణాల్లో ఉన్న నాణ్యత లోపాలని కేంద్రం చెప్పడమేనని ఆమె పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో ఉండాల్సిన ఎత్తు కంటే తక్కువగా కట్టడం వల్ల ప్రాజెక్ట్ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని జర్మన్ కంపెనీ రిపోర్ట్లు చెబుతున్నాయని వెల్లడించారు. పోలవరం పనులు ఆగిపోయిన విషయాన్ని ప్రజలు గమనించకుండా ఉండటానికే ఈ లడ్డూ వివాదాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా వాడుకుంటున్నారనేది ఆమె ప్రధాన ఆరోపణ. రాజధాని అమరావతి కోసం రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారని, కానీ అభివృద్ధి మాత్రం వైజాగ్‌లో జరుగుతోందని, ఇక్కడ కేవలం ప్రభుత్వ కార్యాలయాలు కట్టి సరిపెడుతున్నారని ఆమె విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడం లేదు, కొత్త పెన్షన్లు మంజూరు కావడం లేదు.

ఇలాంటి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే వైజాగ్‌లో లక్షలాది కిలోల గోమాంసం పట్టుబడిన ఘటన గురించి మాట్లాడుతూ, సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గోమాతను పూజించే దేశంలో ఇంత భారీ ఎత్తున మాంసం ఎగుమతి జరుగుతుంటే అది ధర్మ పరిరక్షణ ఎలా అవుతుందని నిలదీశారు. దీని వెనుక ఉన్న పెద్దలెవరో తేల్చాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాజకీయాల్లో విమర్శలు హుందాగా ఉండాలని, వ్యక్తిగత దూషణలు, ఇళ్ల మీద దాడులు చేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ప్రజలు తమను నమ్మి ఓట్లు వేశారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులు చేయాలని కోరారు. అధికారం శాశ్వతం కాదని, చేసే పనులు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని, లేకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెబుతారని రజిని హెచ్చరించారు. మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అభివృద్ధి కంటే అరాచకమే ఎక్కువగా కనిపిస్తోందని ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

Advertisement
Advertisement

Recent Posts

Chandrababu : చంద్రబాబు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ‘కనిపించని శక్తులు’ ?

Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…

4 minutes ago

Ram Charan Upasana Twins : ఉపాసన కవలపిల్లల డెలివరీ వెనక జరిగిన అసలు నిజం బయటపడింది

Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …

1 hour ago

Ys Jagan : ఒకే ఒక్క ఫోన్ కొంప ముంచింది .. అడ్డంగా దొరికిన జగన్ బాబాయ్..!

Ys Jagan  : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…

2 hours ago

Xiaomi 17T Pro : కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి సూపర్‌ చాన్స్‌ .. షియోమీ 17T ప్రో .. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వాడొచ్చు..

Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…

3 hours ago

AI ఎప్పటికీ భర్తీ చేయలేని పనులు ఇవే.. ఇందులో మీ జాబ్ ఉందో, లేదో చెక్‌చేసుకోండి !!

AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…

4 hours ago

Vivo T3 FE 5G Review : Vivo సంచలనం: 25 నిమిషాల్లో ఫుల్ చార్జ్.. మ్యాజిక్ కెమెరాతో వివో టీ3 ఎఫ్ఈ 5G ఫోన్.. బడ్జెట్ ధరలోనే అద్భుత ఫీచర్లు

Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్‌లో మరో విప్లవాత్మక…

5 hours ago

Ambati Rambabu : జైల్లో ఉన్నాడు ఏం పీకుతాడులే అనుకున్న కూటమి కి బిగ్ షాక్ ఇచ్చిన అంబటి రాంబాబు

Ambati Rambabu : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్…

6 hours ago

Earthquake : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. హైదరాబాద్ శివార్లలో భూ ప్రకంపనల కలకలం .. ఉలిక్కిపడ్డ స్థానికులు ..!

Earthquake : హైదరాబాద్ Hyderabad నగర శివార్లలో మంగళవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించినట్లుగా…

8 hours ago