Posani Krishna Murali : పోసాని ఊపిరి పీల్చుకోవచ్చా..?
Posani Krishna Murali : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణమురళికి నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల పోసాని పై నమోదైన కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు కొనసాగగా, న్యాయమూర్తి ఆయన్ను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసే తీర్పును ప్రకటించారు. ఈ కేసులో వైసీపీ లీగల్ టీమ్ తరఫున ప్రముఖ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. కోర్టు వాదనలు పరిశీలించిన తర్వాత బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది, ఇది పోసాని అనుచరులకు మరియు వైసీపీ వర్గాలకు భారీ ఊరట కలిగించింది.
Posani Krishna Murali : పోసాని ఊపిరి పీల్చుకోవచ్చా..?
వైసీపీ లీగల్ టీమ్ తరఫున న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు న్యాయస్థానంలో పోసాని నిర్దోషి అని సమర్థంగా వాదనలు వినిపించారు. కేసుకు సంబంధించి సరైన ఆధారాలు లేవని, నిర్దోషులపై రాజకీయ కుట్రలో భాగంగా ఈ కేసు నమోదైనట్టు న్యాయవాది కోర్టుకు వివరించారు. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం ప్రకటించారు. అయితే బెయిల్ మంజూరుతో పాటు రూ.10,000 పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
పోసానికి న్యాయస్థానం నుండి బెయిల్ మంజూరవడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అనేక మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పోసానిపై అకారణంగా కేసులు నమోదు చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని విమర్శలు చేశారు. పోసాని బెయిల్తో వైసీపీ వర్గాల్లో సంతృప్తి నెలకొంది. ఇప్పటి నుంచి మరింత ధైర్యంగా ముందుకు సాగుతామని, పార్టీ కోసం పోరాడుతూనే ఉంటామని పోసాని అనుచరులు ధీమా వ్యక్తం చేశారు.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.