By Reddy Siddhartha Reddy : ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, వైసీపీ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర పేరిట పొలిటికల్ టూర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉభయగోదావరి జిల్లాలో సాగుతున్న ఈ యాత్రలో వైసీపీ పార్టీపై అదేవిధంగా సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి రానివ్వకుండా ఉండటమే తన లక్ష్యమని పెద్దపెద్ద డైలాగులు వేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాజాగా కౌంటర్లు వేశారు. దీనిలో భాగంగా ముద్రగడ పద్మనాభం రాసిన లెటర్ పై జనసేన నేతలు చేస్తున్న విమర్శలను బైరెడ్డి తిప్పికొట్టారు.
ప్రశ్నించిన ముద్రగడని విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన వాళ్ళు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని, దరిద్రుడు, దొంగ.. ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి అని పవన్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ మంచోడిని అని నేను అన్నాను అనుకో వాళ్ళ అభిమానులంతా నన్ను మంచోడని పొగుడుతారు. అదే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే వాళ్ళ అభిమానులంతా నన్ను విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడాలి. చంద్రబాబును వ్యతిరేకిస్తే నువ్వు పూర్తిగా వ్యతిరేకించు. అంతేగాని 2009 ఎన్నికల్లో చంద్రబాబును విమర్శించి, మళ్లీ 2014 ఎన్నికల్లో పొగిడి… మళ్ళీ 2019 ఎన్నికల్లో విమర్శించి ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి తొత్తుగా వ్యవహరిస్తుంటే మధ్యలో ప్రజలు ఏమైనా తిక్కోలా అంటూ పవన్ ని బైరెడ్డి నిలదీశారు.
ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు క్లారిటీగా మాట్లాడాలని అన్నారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో గెలుస్తామని బైరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ మొదటి విడత మేనిఫెస్టో పై కూడా స్పందించారు. వైసీపీ ఇస్తున్న పథకాల పేర్లు మార్చి..టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే అవటానికి పవన్ కళ్యాణ్ తెగ పాకులాడుతున్నారు అంటూ వారాహి విజయ యాత్రపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అర్ధంలేనివి అనీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఖండించారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.