
Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ దుమారం రేగింది. గోవుల మరణాలకు టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని భూమన చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఎస్వీయూ పోలీసులు భూమనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తిరుపతిలో రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తతకు దారి తీసింది.
Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!
ఈ వివాదం మొదలు కాగానే భూమన, గోశాలను స్వయంగా పరిశీలించాలని నిర్ణయించగా, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపించింది. దీనికి స్పందనగా భూమన రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ నేతలు ఆయన ఆరోపణలను తప్పుబట్టి, గోశాలలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది.
ఇక వైసీపీ నాయకులు భూమన చేసిన ఆరోపణలు నిజమైనవే అని, ప్రభుత్వం ఆ ఆరోపణలను పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇటు టీడీపీ నేతలు ఈ ఆరోపణలను అసత్య ప్రచారంగా కొట్టిపారేసి, భూమన తన హోదాను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ central government వాటా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.…
Vivo V23 Max Review : స్మార్ట్ఫోన్ SmartPhone మార్కెట్లో స్టైలిష్ డిజైన్స్, అద్భుతమైన కెమెరాలకు పెట్టింది పేరు వివో…
Gas Cylinder : ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ అంటే మన కళ్లముందు ఒకే చిత్రం కనిపించేది. ఎరుపు రంగులో ఇనుముతో…
AP 2029 Elections : ఏపీ రాజకీయ ముఖచిత్రం 2029 ఎన్నికల నాటికి సమూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం…
Rythu Bharosa : తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…
India Post GDS Jobs : ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ GDS రిక్రూట్మెంట్ 2026 ప్రక్రియకు సంబంధించి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా 16వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి భారీ…
ICC T20 World Cup 2026 : ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా సరే భారత జట్టు పాల్గొనే మ్యాచ్లే…
This website uses cookies.