
Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ దుమారం రేగింది. గోవుల మరణాలకు టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని భూమన చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఎస్వీయూ పోలీసులు భూమనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తిరుపతిలో రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తతకు దారి తీసింది.
Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!
ఈ వివాదం మొదలు కాగానే భూమన, గోశాలను స్వయంగా పరిశీలించాలని నిర్ణయించగా, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపించింది. దీనికి స్పందనగా భూమన రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ నేతలు ఆయన ఆరోపణలను తప్పుబట్టి, గోశాలలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది.
ఇక వైసీపీ నాయకులు భూమన చేసిన ఆరోపణలు నిజమైనవే అని, ప్రభుత్వం ఆ ఆరోపణలను పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇటు టీడీపీ నేతలు ఈ ఆరోపణలను అసత్య ప్రచారంగా కొట్టిపారేసి, భూమన తన హోదాను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.