Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!

 Authored By ramu | The Telugu News | Updated on :18 April 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!

Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గోశాలలో గోవుల మరణాలపై మాజీ టీటీడీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ దుమారం రేగింది. గోవుల మరణాలకు టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని భూమన చేసిన ఆరోపణలపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు మేరకు తిరుపతి ఎస్వీయూ పోలీసులు భూమనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన తిరుపతిలో రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తతకు దారి తీసింది.

Bhumana Karunakar Reddy గోశాల రగడ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

Bhumana Karunakar Reddy : గోశాల రగడ.. భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!

ఈ వివాదం మొదలు కాగానే భూమన, గోశాలను స్వయంగా పరిశీలించాలని నిర్ణయించగా, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపించింది. దీనికి స్పందనగా భూమన రోడ్డుపై పడుకుని నిరసన తెలపడంతో ఉద్రిక్తత పెరిగింది. టీడీపీ నేతలు ఆయన ఆరోపణలను తప్పుబట్టి, గోశాలలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టం చేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది.

ఇక వైసీపీ నాయకులు భూమన చేసిన ఆరోపణలు నిజమైనవే అని, ప్రభుత్వం ఆ ఆరోపణలను పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఇటు టీడీపీ నేతలు ఈ ఆరోపణలను అసత్య ప్రచారంగా కొట్టిపారేసి, భూమన తన హోదాను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది