JD Lakshmi Narayana : సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన పోలీసులని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది.. పాత కేసుల్లో నిందితుల శిష్యులు తమ బాస్ కు శిక్ష పడేలా చేశానని తనపై కక్ష పెంచుకున్నారని జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు.. తన కుటుంబసభ్యులు భయపడ్డారని, వారి ఆందోళన మేరకు తాను సీపీకి ఫిర్యాదు చేసినట్టు లక్ష్మీనారాయణ తెలిపారు. తనను అంతమొందించేందుకు గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు టాక్ నడుస్తుంది.
గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి తదితరులు జైలుకు వెళ్లడం మనం చూశాం. అప్పుడు విచారణ అధికారిగా ఉన్నది లక్ష్మీనారాయణే. అందుకే ఆయనని చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుసుకున్న జేడీ కంప్లైంట్ ఇచ్చారు. సాధారణంగా పోలీసు విభాగాల్లో అనేక సంవత్సరాలు పని చేశాము సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు, కేసులు విచారించినప్పుడు మా బాసులను కష్టపెట్టాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. మా బాసుకి రిటర్న్ గిఫ్ట్ గా నాకు హాని కలిగించి బాసుకి రిటర్న్ గిఫ్ట్ పంపిద్దాం అని రెడీగా ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం నాకు తెలియగానే దాని గురించి వెరిఫై చేశాను. వ్యక్తి బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేయగా, దీనికి వెనక ఏదో కుట్ర ఉందని అర్ధమైంది.
నామినేషన్ వేసిన వ్యక్తి నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటాడని కూడా చెప్పారు. ఇవన్నీ కలిపి సీపీకి ఫిర్యాదు చేశాను. అలానే అనుమానితుల పేర్లను కూడా ఫిర్యాదులో రాసుకొచ్చినట్టు తెలిపారు. వ్యక్తుల పేర్లు వాడుకొని లబ్ధి పొందే వ్యక్తిని కాను.ఈ విషయం మీద పూర్తి విచారణ జరగాలి. ఎన్నికల సమయంలో నాపై దాడి చేయడం చాలా సులభం. నేను పబ్లిక్లో తిరుగుతుంటాను. సందులు గొందులు వెళుతుంటాను. ఈ సమయంలో ఎవరైన ఏదైన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఆలోచనతోనే వారిపై యాక్షన్ తీసుకోవాలంటూ సీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు జేడి.
Diwali : దీపావళి పండగను చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. చిన్నపిల్లలకు దీపావళి పండుగ…
Teeth : ప్రతి ఒక్కరికి కూడా తెల్లని మరియు శుభ్రమైన దంతాలు అనేవి చాలా మంచిది. కానీ ఎన్నోసార్లు మన…
Zodiac Signs : అట్లతద్ది ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను పెళ్లి కాని వారు మంచి భర్త…
Konda Surekha : ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గం చెందిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్…
Farmers : మన దేశంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా…
Ap Govt New Pensions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు లబ్ధి…
HYDRA : GHMC పరిధిలోని పబ్లిక్ ఆస్తులు మరియు విపత్తు నిర్వహణను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం హైడ్రా (హైదరాబాద్…
vijayasai reddy : ఏపీలో వైసీపీ దారుణమైన ఓటమి చవి చూశాక జగన్ సరికొత్త ఎత్తులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.…
This website uses cookies.