Chandrababu Naidu : ‘కుప్పం సాక్షిగా చెబుతున్న పవన్ కళ్యాణ్ కి 70 సీట్లు ఇస్తా ‘ – చంద్రబాబు నాయుడు..!!

Advertisement
Advertisement

Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం కుప్పం పర్యటన లో ఉన్నారు. మూడు రోజులపాటు కుప్పంలో ఆయన పర్యటించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే నెల నుంచి భారీ బహిరంగ సభలను నిర్వహించాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఇలా ఉంటే కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సినిమా అయిపోయిందని, ఆ పార్టీ ఇంకా వంద రోజులు మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు సొంత కుటుంబం లాంటి వారని, ఇక్కడి ప్రజలు 35 ఏళ్లుగా తనని కుటుంబ సభ్యుడిగా భావించి ప్రేమాభిమానాలు అందించారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం గర్వం పడే విధంగా ఇన్నేళ్లుగా గెలిపించారు.

Advertisement

ఈ ప్రభుత్వంలో నాలాంటి వాడికే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలీసులు ముందుకు రావాలి అని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని, ఇంతవరకు ఏ గ్రామంలో రోడ్డు కూడా వేయలేదని అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఐదేళ్లలో ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గొడవలు దాడులు జరుగుతున్నాయి. కుప్పంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉంది అని ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ పై ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాను అని అన్నారు.

Advertisement

వై.యస్.జగన్మోహన్ రెడ్డి తన సొంత ఎమ్మెల్యే, ఎంపీలను మారుస్తాను అంటున్నాడు కానీ వారికి దొంగ బుద్ధులు నేర్పింది జగనే కదా అని ఎద్దేవా చేశారు. జగన్ సహకరించనిదే ఎమ్మెల్యేలు ఎంపీలు రౌడీయిజం చేశారా అని అన్నారు. సంక్షేమ పథకాలతో మోసపోవద్దని చెప్పారు. ఎక్కడ చూసినా వై.యస్.జగన్మోహన్ రెడ్డి దోపిడి మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. సాండ్, ల్యాండ్ లలో స్కామ్లు చేసి ప్రజలను దోచుకుంటున్నాడు అని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అవినీతి రాజకీయం చేశాడని చంద్రబాబు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే టీడీపీ జనసేన తో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా వైయస్సార్ సీపీ పై గెలవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమిగా ఏర్పడి శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

58 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.