Home » Andhra Pradesh » Chandrababu Satires On Ys Jagan
andhra pradesh

Chandrababu : నా బీసీలు అంటూ రోజా డైలాగుపై చంద్రబాబు సెటైర్లు.. వీడియో !!

Authored By
Breaking News
The Telugu News | Updated on: September 8, 2023 3:06 pm
Advertisement

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా బహిరంగ సభలలో నా బీసీలు, నా ఎస్సీ లు, నా మైనారిటీలు అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు చేయడం తెలిసిందే. అయితే జగన్ ఈ రకంగా చేసే ప్రసంగంపై గుత్తిలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏ బీసీకి అయినా న్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయినా ఏమైనా ఇచ్చారా అని నిలదీశారు. బీసీ వర్గాలను జగన్ ఆర్థికంగా పైకి తీసుకొచ్చాడా అని ప్రశ్నించారు.

Advertisement

అలాంటప్పుడు ఎందుకయ్యా నా బీసీలు అంటూ నాటకాలు ఆడుతావు అని జగన్ మీద చంద్రబాబు మండిపడ్డారు. అంతకుముందు తలనిమిరాడు… ఒక ఛాన్స్ అన్నాడు ఇప్పుడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు. ఈ ఛాన్స్ ఇక ఆఖరి ఛాన్స్ కావాలి అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మరోసారి జగన్ కి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ బతకలేని పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజల జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందని ప్రశ్నించారు. మీ కష్టాలు ఏమైనా తీరాయా అని ప్రజలను అడిగారు.

chandrababu satires on YS jagan

Advertisement

ఎవరైనా జగన్ అధికారంలోకి వచ్చాక నాకు ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గాయి అంటే… ప్రభుత్వం బాగా చేసింది అంటే తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా కావాలంటే.. అంటూ ప్రజలకు సవాల్ విసిరారు. జగన్ అధికారంలోకి వచ్చాక భయంకరంగా రేట్లు పెరిగిపోయాయని.. చంద్రబాబు మండిపడ్డారు.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి