
Dwakra Women : డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
Dwakra Women : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల మహిళలకు శుభవార్త తెలిపింది. వ్యవసాయ రంగంలో మహిళల సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, డ్వాక్రా మహిళలకు 80 శాతం రాయితీతో డ్రోన్లు అందించనున్నారు. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.10 లక్షలు కాగా, అందులో రూ.8 లక్షలు రాయితీగా అందిస్తారు. మిగిలిన రెండు లక్షలు బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి లేదా వివో ద్వారా రుణంగా పొందే అవకాశం ఉంటుంది.
Dwakra Women : డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
ఈ ఏడాది మొత్తం 440 మంది మహిళలకు డ్రోన్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మొదటిగా 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన లబ్ధిదారుల ఎంపికను జూలై నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎంపికైన మహిళలకు డ్రోన్లను పంపిణీ చేయడంతో పాటు, వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి డీ హెచ్ఏజీఈ-10 రకం డ్రోన్లు కేంద్రం అందిస్తోంది. ఇవి తక్కువ బరువు కలిగి ఉండటంతో రైతుల పొలాల్లో సులభంగా రసాయనాలను పిచికారీ చేయగలవు.
డ్రోన్ల వినియోగంతో వ్యవసాయంలో సమయం, శ్రమను ఆదా చేయడమే కాకుండా, రసాయనాల వినియోగం 10 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల పంటలపై అధిక నాణ్యతతో ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించగా, కేంద్రం ఆశించిన విధంగా పథకం ప్రయోజనాలు మహిళలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు, మహిళలకు లబ్ధి చేకూర్చే ఈ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా నమోదవుతున్న అక్రమ కేసుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఒక…
Dhurandhar 2 : ప్రస్తుతం ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 సినిమా ఏ రేంజ్లో రచ్చ చేస్తోందో…
Supreme court : సుప్రీం కోర్టు ఇటీవల ఒక కీలకమైన కేసులో భార్యాభర్తల బంధం గురించి చాలా గొప్ప మాటలు…
Ration Card : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడుతున్న…
Garikapati Narasimha Rao : ప్రవచనకర్తగా సమాజంలో ఎంతో గౌరవం ఉన్న గరికపాటి నరసింహారావు ఈ మధ్య తన నోటి…
Ysrcp : ఆంధ్రరాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైపోయింది. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు తిరుగుతున్నాయి.…
Indian : మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి…
Rain Alert : ఎండలు తీవ్రంగా మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత ఉపశమనం లభించనున్నట్లు వాతావరణ శాఖ…
Ration Card : తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం…
KV School Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి అవకాశంగా కేంద్ర…
Vivo 5G Smartphone : భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో వివో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. స్టైలిష్…
PAN Card : కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియలో ముఖ్యమైన మార్పులను ప్రకటించింది. 2026–27 ఆర్థిక సంవత్సరాన్ని…
This website uses cookies.