Dwakra Women : డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
Dwakra Women : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపుల మహిళలకు శుభవార్త తెలిపింది. వ్యవసాయ రంగంలో మహిళల సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, డ్వాక్రా మహిళలకు 80 శాతం రాయితీతో డ్రోన్లు అందించనున్నారు. ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.10 లక్షలు కాగా, అందులో రూ.8 లక్షలు రాయితీగా అందిస్తారు. మిగిలిన రెండు లక్షలు బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి లేదా వివో ద్వారా రుణంగా పొందే అవకాశం ఉంటుంది.
Dwakra Women : డ్వాక్రా మహిళలకు 80 శాతం తో కొత్త పథకం..!
ఈ ఏడాది మొత్తం 440 మంది మహిళలకు డ్రోన్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మొదటిగా 88 మంది లబ్ధిదారులను సెర్ప్ అధికారులు ఇప్పటికే ఎంపిక చేశారు. మిగిలిన లబ్ధిదారుల ఎంపికను జూలై నెలాఖరు వరకు పూర్తి చేయాలని అధికారులుకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎంపికైన మహిళలకు డ్రోన్లను పంపిణీ చేయడంతో పాటు, వాటిని ఎలా వినియోగించాలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి డీ హెచ్ఏజీఈ-10 రకం డ్రోన్లు కేంద్రం అందిస్తోంది. ఇవి తక్కువ బరువు కలిగి ఉండటంతో రైతుల పొలాల్లో సులభంగా రసాయనాలను పిచికారీ చేయగలవు.
డ్రోన్ల వినియోగంతో వ్యవసాయంలో సమయం, శ్రమను ఆదా చేయడమే కాకుండా, రసాయనాల వినియోగం 10 శాతం వరకు తగ్గుతుంది. దీనివల్ల పంటలపై అధిక నాణ్యతతో ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన పెరిగే అవకాశముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నమో డ్రోన్ దీదీ’ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని స్పష్టంగా ఆదేశించగా, కేంద్రం ఆశించిన విధంగా పథకం ప్రయోజనాలు మహిళలకు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు, మహిళలకు లబ్ధి చేకూర్చే ఈ పథకం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గేమ్ ఛేంజర్ గా నిలవనుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.