
Geethanjali : గీతాంజలి భర్త బయట పెట్టిన దారుణ నిజాలు.. ఆమె చనిపోవడానికి కారణాలు ఇవే...!
Geethanjali : ఆంధ్రప్రదేశ్ లో గీతాంజలి ఆత్మహత్య రాజకీయాలలో కలకలం రేపింది. టీడీపీ అల్లరి మూకల దాష్టికానికి ఆమె బలయిందని సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మా తప్పేమీ లేదని తెలుగుదేశం పార్టీ కవర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో గీతాంజలి భర్త బాలచందర్ కీలక విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య మానసిక వేదనకు గురైందని చివరకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. గీతాంజలి భర్త చెప్పిన దాని ప్రకారం తన భార్య తీవ్ర మానసిక వేదన అనుభవించినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి కూడా ఫోన్ చూసుకొని ఆమె బాధపడేదని చెప్పారు. పిల్లలను స్కూల్ కి పంపించి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. తాము ఎప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు, పోస్ట్ లు పెట్టలేదని, ఆ అలవాటు కూడా తమకి లేదని కానీ తమపై మాత్రం కామెంట్లు పెట్టి వేధించారని అన్నారు. ఆ కామెంట్లు చూసి తన భార్య తీవ్ర ఆవేదన చెందిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడిందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలతో లబ్ధి పొందిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం సహజం. కానీ గీతాంజలి తనకు తాను ఏ పోస్టింగ్ పెట్టలేదు. ఇంటి పట్టా తీసుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ఎక్కడా వైయస్ జగన్ ని కానీ వైసీపీని కానీ ఆమె విపరీతంగా పొగడలేదు. అలా అని ప్రతిపక్షాల ప్రస్తావన కూడా ఆమె తీసుకురాలేదు. అయినా కూడా టీడీపీ ఆమెను టార్గెట్ చేసిందని అంటున్నారు. టీడీపీ అనుబంధ ఎకౌంట్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ జరగటంతో ఆమె మానసిక వేదనకు గురైంది అని చివరకు ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా మంత్రులు, మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ సోషల్ మీడియా ట్రోలింగ్ ను ఖండించారు. నిందితులకు కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు. ఇక ఇదంతా జరుగుతున్నా టీడీపీ, జనసేన నుంచి మౌనం మాత్రమే సమాధానం అయింది. మహిళా దినోత్సవం రోజు ఆడవారందరికీ అండగా ఉంటామని ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ కూడా గీతాంజలి మృతి పై కనీసం సానుభూతి కూడా తెలపలేదు. నారీశక్తి నవ శకం అంటూ కబుర్లు చెప్పే చంద్రబాబు నాయుడు కూడా సైలెంట్ గా ఉండిపోయారని అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తిని అందులోను ఒక మహిళను ఇంతలా టార్గెట్ చేయడం చివరకు ఆమె ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయం. ఆమెకు ఇంటి పట్టా వచ్చిన సంతోషంలో తన ఆనందాన్ని పంచుకున్నారు. దానిపై ఇంత ట్రోలింగ్ జరగటం అందులోను అది ఆమె మరణానికి కారణం అవ్వటం బాధాకరమైన విషయం అని చెప్పాలి.
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
This website uses cookies.