Categories: andhra pradeshNews

TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

Advertisement
Advertisement

TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి (TDP) గవర్నర్ పదవిని కేటాయించాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయించినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్యకాలంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కేంద్ర బిజెపి నడుం బిగించింది. ఇటీవలే టిడిపి, బిజెపి మధ్య మంచి సంబంధాల నేపథ్యంలో రాజ్యసభ సీట్ల కేటాయింపులో టిడిపి సహకరించడంతో, ప్రతిఫలంగా గవర్నర్ పదవిపై బిజెపి మరోసారి ఆలోచన ప్రారంభించింది. దీనికి సంబంధించి టిడిపికి సంకేతాలు అందగా, ఇప్పటికే ఇద్దరు నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

TDP : టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన కేంద్రం..? ఆ ఇద్దరి లో ఎవరికీ..?

TDP : టీడీపీ కి చెందిన నేతలకు గవర్నర్ పదవి..?

గవర్నర్ పదవికి టిడిపి నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరిద్దరూ పార్టీకి అనేక దశాబ్దాలుగా సేవలందించి కీలక పదవుల్లో ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్, ఆర్థిక మంత్రి పదవులతో పాటు అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం అధికారంలో టిడిపి ఉన్నప్పటికీ, ఈ ఇద్దరు నేతలకు ప్రత్యక్ష పాలనా పదవులు దక్కలేదు. యనమల ఇటీవలే మండలి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన అప్పట్లో రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా చెప్పిన విషయం గుర్తు చేయాలి.

Advertisement

ఇప్పటికే అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇస్తే, యనమలకు రాజ్యసభ సీటు కేటాయించే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. చంద్రబాబు నాయుడు త్వరలో ఈ రెండు పేర్లపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి పంపనున్నారు. గత పదేళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుల్లో గవర్నర్ పదవికి ఎంపికైన వారు కేవలం నలుగురే కావడం గమనార్హం. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు అలర్ట్.. వారికి రైతు భరోసా క‌ట్‌.. రేవంత్ రెడ్డి స‌ర్కార్‌ కీలక నిర్ణ‌యం..!

Rythu Bharosa  : తెలంగాణలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న…

43 minutes ago

India Post GDS Jobs : నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2026 : రూ.24,470 వరకు వేతనం.. వివరాలివే?

India Post GDS Jobs :  ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ GDS రిక్రూట్‌మెంట్ 2026 ప్రక్రియకు సంబంధించి…

2 hours ago

Andhra Pradesh : గుడ్‌న్యూస్‌.. ఏపీకి వేల కోట్ల నిధులు అందజేయబోతున్న కేంద్రం.. ఇంతకన్నా ఏమికావాలి !!

Andhra Pradesh  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా 16వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి భారీ…

3 hours ago

ICC T20 World Cup 2026 : వామ్మో భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే ఐసిసికి ఇంత నష్టమా?

ICC T20 World Cup 2026 : ఏ ఐసీసీ టోర్నమెంట్ అయినా సరే భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లే…

4 hours ago

Government Jobs : సూపర్‌ ఛాన్స్‌ .. ఏదైనా డిగ్రీ అర్హతతో పర్మనెంట్ ఉద్యోగాలు ..రూ.55,000 నెల జీతం..!

Government Jobs  : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాంచీ IIITR ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ Central…

4 hours ago

Illicit Relationship : కోడలి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన మామను ఏం చేసిందో తెలిస్తే మీరు బిత్తర పోతారు..!

Illicit Relationship : దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ అక్రమ సంబంధాల…

5 hours ago

Redmi Note 13 Pro+ 5G Review: 200MP కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్.. మిడ్-రేంజ్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్

Redmi Note 13 Pro+ 5G Review: ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లతో, సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరతో…

6 hours ago

Jio AC Launch : జియో నుంచి చౌకైన ఏసీ.. ధర రూ.22,000 మాత్రమే.. 5 ఏళ్ల వారంటీ, -5 డిగ్రీల కూలింగ్

Jio AC Launch :  జియో ఏసీ ( Jio AC ) : వేసవి తాపం, కరెంట్ బిల్లుల…

6 hours ago