Categories: andhra pradeshNews

FACT CHECK : ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌పై టీడీపీ ఆరోపణలు.. వండి వార్చిన ఈనాడు.. అవన్నీ నిరాధారమే.. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో ఈనాడు కథనం.. ఇదిగో ఆధారాలు

FACT CHECK : ‘‘డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు వైకాపా కార్యకర్తలే.. సాక్షికి, ఏపీడీసీకి తేడాలేదు.. ఆ రెండింటి పని జగన్‌కు బాకా ఊదడమే’’నంటూ టీడీపీ చేసిన ఆరోపణలను ఒక కథనం రూపంలో 10–10–2023న ‘ఈనాడు’ దినపత్రిక ప్రచురించింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో ఈ కథనం రాశారు.

– ఏపీడీసీ అనేది కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ కానేకాదు. గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటుచేసిన ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ను మార్పు చేస్తూ దీన్ని ఏర్పాటు చేశారు.

– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 31–03–2020న చేసిన జీఓ ఎమ్‌ఎస్‌ నంబర్‌ 19 ద్వారా 23–09–2020న ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏర్పడింది. గత ప్రభుత్వం 14–12–2018న జీఓ ఎమ్‌ఎస్‌ నంబర్‌ 4 ద్వారా ఏర్పాటుచేసిన ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీసీసీ)ని పూర్తిగా మార్చి ఏపీడీసీని ఏర్పాటుచేయడం జరిగింది.

గతంలో ఎప్పుడూ లేనట్టుగా, ఈ ప్రభుత్వంలోనే కొత్తగా ఏర్పాటు చేసినట్టుగా ఒక అపోహ కలిగించేలా ప్రతిపక్షం ఆరోపణలు చేయడం, దాన్ని పతాక శీర్షికల్లో ఈనాడు దినపత్రిక ప్రచురించడం వెనుక అసలు ఉద్దేశాలను ఇట్టే చెప్పొచ్చు.

#image_title

– ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్‌ ఆర్టికల్స్‌లో ఏపీడీసీ లక్ష్యాలు, పాత్ర స్పష్టంగా వివరించడం జరిగింది. ఏపీడీసీ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం, అలాగే ప్రభుత్వాన్ని నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రిగారి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేయడం.

– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహా అన్ని విభాగాల తరపున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తుంది. ప్రభుత్వాధినేతగా, ప్రభుత్వ సారథిగా, ఆ కార్యక్రమాల సృష్టికర్తగా గౌరవ ముఖ్యమంత్రిగారు ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కానేకాదు. మరి దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురదజల్లడమే.

– ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని నడిపే సారథిని ప్రమోట్‌ చేయడమనేది… గత ప్రభుత్వంలో ఉన్న ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ చేసింది, ఇప్పుడున్న ఏపీడీసీ కూడా అదే చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ చేస్తే ఒప్పు… అదే కంటెంట్‌ కార్పొరేషన్‌ స్థానంలో పేరు మార్చుకుని ఏర్పాటైన ఏపీడీసీ చేస్తే తప్పు కాదు కదా.

– గత ప్రభుత్వ కార్యక్రమాలు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజీని పెంచడానికి గ్రూప్‌ – ఎమ్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, కోట్లాది రూపాయలు చెల్లించారు.

– భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ఏపీడీసీ ఏర్పడింది. ఆ మిషన్‌ ఉద్దేశాలు, నిర్దేశించిన లక్ష్యాల్లో భాగంగా ఏపీడీసీ తన పనిని అద్భుతంగా నిర్వర్తిస్తోంది.

– డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ప్రచారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎమ్‌ఈఐటీవై, ఎమ్‌ఐబీ, డీఏవీపీ వంటి వాటి మార్గదర్శకాలనే ఏపీడీసీ కూడా అనుసరిస్తోంది. వాటికి అనుగుణంగానే ఏపీడీసీ డిజిటల్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ తయారయింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతులను జీఓల రూపంలో పొందింది. పద్ధతి ప్రకారం ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇందులో తప్పులు ఎంచి బురదజల్లే కార్యక్రమాన్ని ప్రతిపక్షం, ఈనాడు దినపత్రిక నిర్వహిస్తున్నాయి.

– రేట్‌కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీడీసీ స్వీకరించింది. దానికి అనుగుణంగానే వెబ్‌సైట్‌లు, సోషల్, డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాలు, యాడ్‌ ఏజెన్సీలు మొదలైన వాటికి ఎంప్యానెల్‌ చేయడానికి ప్రముఖ జాతీయ, ప్రాంతీయ ప్రింట్‌ మీడియా పబ్లికేషన్స్‌లో ఆర్‌ఎఫ్‌పీలను ఏపీడీసీ ప్రచురిస్తుంది. ఆర్‌ఎఫ్‌ఈలను సమాచార ప్రసార శాఖ, ఏపీడీసీ వెబ్‌సైట్లలో కూడా ప్రచురిస్తుంది. ఎంప్యానల్‌మెంట్‌ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతుంది. ఇలా అన్నీ సక్రమంగా జరిగాకే ఎంప్యానెల్‌ ఏజెన్సీలకు ఏపీడీసీ వర్క్‌ ఆర్డర్లను జారీ చేస్తుంది. ఇంత పారదర్శకంగా పనిచేస్తున్నా సరే.. ఉద్దేశ పూర్వకంగా ఏపీడీసీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.

– ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారాన్నే తీసుకుంటే… ఏపీడీసీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలను కూడా ఏదో ఒక్క ఏజెన్సీకో కట్టబెట్టిన సందర్భం ఒక్కటీ లేదు. ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు ఏజెన్సీలకు ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. కాబట్టి, కేవలం ఒక మీడియా సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. కార్యక్రమాలు, లక్షిత వీక్షకుల ఆధారంగా వీలైనంత ఎక్కువ మంది వీక్షకులకు చేరే ప్లాట్‌ఫారాలకే ఏపీడీసీ ఇప్పటివరకు ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చింది. ప్రకటనల జారీలో వివిధ అధీకృత సంస్థలు పాటించే పద్ధతే ఇది.

– ఏపీడీసీపై ఆరోపించినట్టుగా వైయస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ కాన్సెప్ట్‌ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు. అంతేకాదు, ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీ కూడా కాదు. ఇలాంటి పచ్చి అబద్ధాలను కూడా ప్రచారం చేయడం వారి ఆరోపణలు అవాస్తవాలు అనడానికి నిదర్శనం.

– ఇక, వ్యయం విషయానికొస్తే ఈ నాలుగున్నరేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేశారనేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. ఏపీడీసీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జీతాలు, కార్యక్రమాల ప్రమోషన్లపై చేసిన మొత్తం ఖర్చు రూ.88.56 కోట్లు మాత్రమే.

– ఐప్యాక్‌కు కూడా ప్రకటనలు ఇస్తున్నారన్నది పూర్తి అబద్ధం. ఐ ప్యాక్‌ అనేది ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీ కాదు. ఐప్యాక్‌కు ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. అలాగే ఐడ్రీమ్‌ కూడా ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీ కాదు. ఐడ్రీమ్‌కు కూడా ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఈ విషయంలో చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం.

– నియామకం, రిక్రూట్‌మెంట్‌ విషయానికొస్తే… సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యం, ప్రత్యేకించి న్యూ ఏజ్‌ మీడియాలో ఉన్న అపారమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, అర్హతలను ప్రామాణికంగా తీసుకుని నియామకాలు జరిగాయి.

– ఏపీడీసీలో, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఇప్పుడున్న ఉద్యోగులంతా సాక్షి ఉద్యోగులు అని మరో ఆరోపణ చేశారు. ఏపీడీసీలోని ఉద్యోగుల నియామకాలకు వస్తే… ఈ నియామకాలన్నీ జీఓ నంబర్‌ 94 ప్రకారమే, అన్ని విధివిధానాలను అనుసరించే జరుగుతున్నాయి. ఏపీడీసీలో పని స్వభావం కారణంగా… ఇందులో పనిచేయడానికి దరఖాస్తు చేసుకునేవారిలో ఎక్కువ మంది వివిధ మీడియా సంస్థలకు చెందినవారే ఉంటారు. వీరిలో గతంలో ఈనాడు మీడియా సంస్థల్లో కూడా పనిచేసినవారూ ఉన్నారు.

గతంలో ఇదే ఉద్యోగులు ఈనాడులో పనిచేశారు. అక్కడ పనిచేసిన వారే సాక్షికి వచ్చారు. ప్రభుత్వంలో సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిగానీ, జీవీడీ కృష్ణమోహన్‌గానీ, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్‌.ధనుంజయరెడ్డిగానీ, ముఖ్యమంత్రికి సీపీఆర్వోగా ఉన్న శ్రీహరి గానీ.. వీరంతా గతంలో ఈనాడులో పనిచేసినవారే. ఈ విషయం ఈనాడుకు కూడా తెలుసు. ఈనాడులో పనిచేసి అక్కడనుంచి సాక్షికి వచ్చారన్నది వాస్తవం. వీరికి అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈనాడు ఉద్యోగాలు ఇచ్చింది. అవే అర్హతలు ఉన్నాయి కాబట్టి సాక్షిలో కూడా ఉద్యోగాలు పొందారు. అవే అర్హతలను పరిగణలోకి తీసుకుని, ఇటు ప్రభుత్వంలోనూ, అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వారికి ఆయా స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ, ఈనాడు దినపత్రిక చేసేవి అడ్డగోలు వాదనలని ఇక్కడే తేలిపోతోంది.

చంద్రబాబు హయాంలో మంత్రులకు పీఆర్వోలుగా, సమాచార శాఖలో పీఆర్వోలుగా, ముఖ్యమంత్రికి పీఆర్వోలుగా పనిచేసినవారు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థల్లో పనిచేసినవారే.

– ఒక కార్పొరేషన్‌గా ఏపీడీసీ వివిధ విభాగాల నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. అన్ని ప్రభుత్వ విభాగాలూ ఏపీడీసీ సేవలను, డిజిటల్‌ స్పేస్‌లో ఏపీడీసీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ 18–10–2021న ఇచ్చిన మెమో నంబర్‌ జీఏడీ 01 – పీయూ0జీఏడీ/5/2021 – పీయూ – బీ ద్వారా అన్ని విభాగాలకూ సూచించింది.

– అన్ని ప్రభుత్వ విభాగాల్లానే ఏపీడీసీ కూడా అన్ని ఆడిట్‌ విధానాలనూ అనుసరిస్తుంది. అందువల్ల ఏపీడీసీ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది.

– వివిధ సామాజిక, డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏపీడీసీ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటిస్తున్నాం.

– వాస్తవాలు ఇలా ఉంటే… అసత్యాలతో ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను అప్రదిష్టపాలు చేసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పూనుకోవడం దురదృష్టకరం. ఈ చర్యలను ఏపీడీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రయోజనాలు పరిరక్షించేందుకు సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన చర్యలను ఏపీడీసీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం.

Recent Posts

Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?

Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే…

17 minutes ago

SSC Stenographer : 12వ త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 261 ప్ర‌భుత్వ ఉద్యోగాలు..!

SSC Stenographer : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూన్ 6, 2025న SSC స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025ను విడుదల…

1 hour ago

Health Benefits : ఖర్జూర, పాలు కలిపి తీసుకునే వారికి… ఇది మీకోసమే.. తప్పక తెలుసుకోవలసిన విషయం…?

Health Benefits : ఆరోగ్యకరమైన పానీయాలలో పాలు శ్రేష్టం.ఈ పాలను పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ కూడా…

2 hours ago

Venus Transit : ఈ రాశుల వారికి శుక్రుడు కనక వర్షం కురిపిస్తున్నాడు…?

Venus Transit : నవగ్రహాలలో కెల్లా కీలకమైన గ్రహం శుక్రు గ్రహం. శుక్ర గ్రహం రాక్షసులకు గురువు. శుక్రుడు సంపదకు,…

3 hours ago

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

12 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

13 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

14 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

15 hours ago