Categories: andhra pradeshNews

FACT CHECK : ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌పై టీడీపీ ఆరోపణలు.. వండి వార్చిన ఈనాడు.. అవన్నీ నిరాధారమే.. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో ఈనాడు కథనం.. ఇదిగో ఆధారాలు

Advertisement
Published by
Advertisement

FACT CHECK : ‘‘డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు వైకాపా కార్యకర్తలే.. సాక్షికి, ఏపీడీసీకి తేడాలేదు.. ఆ రెండింటి పని జగన్‌కు బాకా ఊదడమే’’నంటూ టీడీపీ చేసిన ఆరోపణలను ఒక కథనం రూపంలో 10–10–2023న ‘ఈనాడు’ దినపత్రిక ప్రచురించింది. ఇందులోని అంశాలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. నిజాలకు పాతరేస్తూ వక్రీకరణలతో ఈ కథనం రాశారు.

Advertisement

– ఏపీడీసీ అనేది కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ కానేకాదు. గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటుచేసిన ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ను మార్పు చేస్తూ దీన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 31–03–2020న చేసిన జీఓ ఎమ్‌ఎస్‌ నంబర్‌ 19 ద్వారా 23–09–2020న ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏర్పడింది. గత ప్రభుత్వం 14–12–2018న జీఓ ఎమ్‌ఎస్‌ నంబర్‌ 4 ద్వారా ఏర్పాటుచేసిన ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీసీసీ)ని పూర్తిగా మార్చి ఏపీడీసీని ఏర్పాటుచేయడం జరిగింది.

గతంలో ఎప్పుడూ లేనట్టుగా, ఈ ప్రభుత్వంలోనే కొత్తగా ఏర్పాటు చేసినట్టుగా ఒక అపోహ కలిగించేలా ప్రతిపక్షం ఆరోపణలు చేయడం, దాన్ని పతాక శీర్షికల్లో ఈనాడు దినపత్రిక ప్రచురించడం వెనుక అసలు ఉద్దేశాలను ఇట్టే చెప్పొచ్చు.

#image_title

– ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్‌ ఆర్టికల్స్‌లో ఏపీడీసీ లక్ష్యాలు, పాత్ర స్పష్టంగా వివరించడం జరిగింది. ఏపీడీసీ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యక్రమాలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం, అలాగే ప్రభుత్వాన్ని నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రిగారి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేయడం.

– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహా అన్ని విభాగాల తరపున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తుంది. ప్రభుత్వాధినేతగా, ప్రభుత్వ సారథిగా, ఆ కార్యక్రమాల సృష్టికర్తగా గౌరవ ముఖ్యమంత్రిగారు ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకం కానేకాదు. మరి దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురదజల్లడమే.

– ప్రభుత్వాన్ని, ప్రభుత్వాన్ని నడిపే సారథిని ప్రమోట్‌ చేయడమనేది… గత ప్రభుత్వంలో ఉన్న ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ చేసింది, ఇప్పుడున్న ఏపీడీసీ కూడా అదే చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడ్డ ఏపీ కంటెంట్‌ కార్పొరేషన్‌ చేస్తే ఒప్పు… అదే కంటెంట్‌ కార్పొరేషన్‌ స్థానంలో పేరు మార్చుకుని ఏర్పాటైన ఏపీడీసీ చేస్తే తప్పు కాదు కదా.

– గత ప్రభుత్వ కార్యక్రమాలు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజీని పెంచడానికి గ్రూప్‌ – ఎమ్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని, కోట్లాది రూపాయలు చెల్లించారు.

– భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల డిజిటల్‌ ఇండియా మిషన్‌లో భాగంగా ఏపీడీసీ ఏర్పడింది. ఆ మిషన్‌ ఉద్దేశాలు, నిర్దేశించిన లక్ష్యాల్లో భాగంగా ఏపీడీసీ తన పనిని అద్భుతంగా నిర్వర్తిస్తోంది.

– డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ప్రచారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎమ్‌ఈఐటీవై, ఎమ్‌ఐబీ, డీఏవీపీ వంటి వాటి మార్గదర్శకాలనే ఏపీడీసీ కూడా అనుసరిస్తోంది. వాటికి అనుగుణంగానే ఏపీడీసీ డిజిటల్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ తయారయింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతులను జీఓల రూపంలో పొందింది. పద్ధతి ప్రకారం ఇవన్నీ నడుస్తున్నప్పుడు ఇందులో తప్పులు ఎంచి బురదజల్లే కార్యక్రమాన్ని ప్రతిపక్షం, ఈనాడు దినపత్రిక నిర్వహిస్తున్నాయి.

– రేట్‌కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీడీసీ స్వీకరించింది. దానికి అనుగుణంగానే వెబ్‌సైట్‌లు, సోషల్, డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాలు, యాడ్‌ ఏజెన్సీలు మొదలైన వాటికి ఎంప్యానెల్‌ చేయడానికి ప్రముఖ జాతీయ, ప్రాంతీయ ప్రింట్‌ మీడియా పబ్లికేషన్స్‌లో ఆర్‌ఎఫ్‌పీలను ఏపీడీసీ ప్రచురిస్తుంది. ఆర్‌ఎఫ్‌ఈలను సమాచార ప్రసార శాఖ, ఏపీడీసీ వెబ్‌సైట్లలో కూడా ప్రచురిస్తుంది. ఎంప్యానల్‌మెంట్‌ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతుంది. ఇలా అన్నీ సక్రమంగా జరిగాకే ఎంప్యానెల్‌ ఏజెన్సీలకు ఏపీడీసీ వర్క్‌ ఆర్డర్లను జారీ చేస్తుంది. ఇంత పారదర్శకంగా పనిచేస్తున్నా సరే.. ఉద్దేశ పూర్వకంగా ఏపీడీసీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు.

– ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రచారాన్నే తీసుకుంటే… ఏపీడీసీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలను కూడా ఏదో ఒక్క ఏజెన్సీకో కట్టబెట్టిన సందర్భం ఒక్కటీ లేదు. ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ కనీసం 5 లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు ఏజెన్సీలకు ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేయడం జరిగింది. కాబట్టి, కేవలం ఒక మీడియా సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. కార్యక్రమాలు, లక్షిత వీక్షకుల ఆధారంగా వీలైనంత ఎక్కువ మంది వీక్షకులకు చేరే ప్లాట్‌ఫారాలకే ఏపీడీసీ ఇప్పటివరకు ప్రకటనలు విడుదల చేస్తూ వచ్చింది. ప్రకటనల జారీలో వివిధ అధీకృత సంస్థలు పాటించే పద్ధతే ఇది.

– ఏపీడీసీపై ఆరోపించినట్టుగా వైయస్‌ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ కాన్సెప్ట్‌ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు. అంతేకాదు, ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్‌ ఏజెన్సీ కూడా కాదు. ఇలాంటి పచ్చి అబద్ధాలను కూడా ప్రచారం చేయడం వారి ఆరోపణలు అవాస్తవాలు అనడానికి నిదర్శనం.

– ఇక, వ్యయం విషయానికొస్తే ఈ నాలుగున్నరేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేశారనేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. ఏపీడీసీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జీతాలు, కార్యక్రమాల ప్రమోషన్లపై చేసిన మొత్తం ఖర్చు రూ.88.56 కోట్లు మాత్రమే.

– ఐప్యాక్‌కు కూడా ప్రకటనలు ఇస్తున్నారన్నది పూర్తి అబద్ధం. ఐ ప్యాక్‌ అనేది ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీ కాదు. ఐప్యాక్‌కు ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. అలాగే ఐడ్రీమ్‌ కూడా ఎంప్యానెల్‌ అయిన ఏజెన్సీ కాదు. ఐడ్రీమ్‌కు కూడా ఏపీడీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలూ ఇవ్వలేదు. ఈ విషయంలో చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవం.

– నియామకం, రిక్రూట్‌మెంట్‌ విషయానికొస్తే… సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యం, ప్రత్యేకించి న్యూ ఏజ్‌ మీడియాలో ఉన్న అపారమైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, అర్హతలను ప్రామాణికంగా తీసుకుని నియామకాలు జరిగాయి.

– ఏపీడీసీలో, ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఇప్పుడున్న ఉద్యోగులంతా సాక్షి ఉద్యోగులు అని మరో ఆరోపణ చేశారు. ఏపీడీసీలోని ఉద్యోగుల నియామకాలకు వస్తే… ఈ నియామకాలన్నీ జీఓ నంబర్‌ 94 ప్రకారమే, అన్ని విధివిధానాలను అనుసరించే జరుగుతున్నాయి. ఏపీడీసీలో పని స్వభావం కారణంగా… ఇందులో పనిచేయడానికి దరఖాస్తు చేసుకునేవారిలో ఎక్కువ మంది వివిధ మీడియా సంస్థలకు చెందినవారే ఉంటారు. వీరిలో గతంలో ఈనాడు మీడియా సంస్థల్లో కూడా పనిచేసినవారూ ఉన్నారు.

గతంలో ఇదే ఉద్యోగులు ఈనాడులో పనిచేశారు. అక్కడ పనిచేసిన వారే సాక్షికి వచ్చారు. ప్రభుత్వంలో సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిగానీ, జీవీడీ కృష్ణమోహన్‌గానీ, ముఖ్యమంత్రి సలహాదారు ఆర్‌.ధనుంజయరెడ్డిగానీ, ముఖ్యమంత్రికి సీపీఆర్వోగా ఉన్న శ్రీహరి గానీ.. వీరంతా గతంలో ఈనాడులో పనిచేసినవారే. ఈ విషయం ఈనాడుకు కూడా తెలుసు. ఈనాడులో పనిచేసి అక్కడనుంచి సాక్షికి వచ్చారన్నది వాస్తవం. వీరికి అర్హతలు ఉన్నాయి కాబట్టే ఈనాడు ఉద్యోగాలు ఇచ్చింది. అవే అర్హతలు ఉన్నాయి కాబట్టి సాక్షిలో కూడా ఉద్యోగాలు పొందారు. అవే అర్హతలను పరిగణలోకి తీసుకుని, ఇటు ప్రభుత్వంలోనూ, అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వారికి ఆయా స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో టీడీపీ, ఈనాడు దినపత్రిక చేసేవి అడ్డగోలు వాదనలని ఇక్కడే తేలిపోతోంది.

చంద్రబాబు హయాంలో మంత్రులకు పీఆర్వోలుగా, సమాచార శాఖలో పీఆర్వోలుగా, ముఖ్యమంత్రికి పీఆర్వోలుగా పనిచేసినవారు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థల్లో పనిచేసినవారే.

– ఒక కార్పొరేషన్‌గా ఏపీడీసీ వివిధ విభాగాల నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది. అన్ని ప్రభుత్వ విభాగాలూ ఏపీడీసీ సేవలను, డిజిటల్‌ స్పేస్‌లో ఏపీడీసీ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ 18–10–2021న ఇచ్చిన మెమో నంబర్‌ జీఏడీ 01 – పీయూ0జీఏడీ/5/2021 – పీయూ – బీ ద్వారా అన్ని విభాగాలకూ సూచించింది.

– అన్ని ప్రభుత్వ విభాగాల్లానే ఏపీడీసీ కూడా అన్ని ఆడిట్‌ విధానాలనూ అనుసరిస్తుంది. అందువల్ల ఏపీడీసీ ఖర్చు చేసే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుంది.

– వివిధ సామాజిక, డిజిటల్‌ మీడియా ప్లాట్‌ఫారాల ద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యకలాపాలు, కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏపీడీసీ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటిస్తున్నాం.

– వాస్తవాలు ఇలా ఉంటే… అసత్యాలతో ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను అప్రదిష్టపాలు చేసేందుకు కొన్ని అసాంఘిక శక్తులు పూనుకోవడం దురదృష్టకరం. ఈ చర్యలను ఏపీడీసీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీడీసీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రయోజనాలు పరిరక్షించేందుకు సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన చర్యలను ఏపీడీసీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం.

Advertisement

Recent Posts

Raw Mangoes : పచ్చి మామిడిని అస్సలు మిస్ అవొద్దు.. వేసవిలో శరీరానికి సూపర్ బెనిఫిట్స్..!

Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…

17 minutes ago

Rajinikanth : రాజకీయాల్లోకి వచ్చుంటే సీఎం అయ్యేవాడిని.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు!

Rajinikanth :  సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…

14 hours ago

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

15 hours ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

19 hours ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

3 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

4 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

4 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

4 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

4 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

4 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

4 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

5 days ago