
Nara Lokesh : నారా లోకేష్ కు పోటీగా మురుగుడు లావణ్య.. ఏరి కోరి మరీ పట్టుకొచ్చిన వైయస్ జగన్..!
Nara Lokesh : 175 కి 175 స్థానాలలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీకి కొన్ని నియోజకవర్గాలలో కాస్త టెన్షన్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై వైసీపీకి టెన్షన్ నెలకొంది. ఎందుకంటే వీరిద్దరూ గెలిచి అసెంబ్లీ లోకి వస్తే వైయస్ జగన్ టార్గెట్ అవుతారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి ఉన్నా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే వైయస్ జగన్ ను టార్గెట్ చేస్తారు. గడిచిన ఐదు సంవత్సరాలలోని అంశాలను బయటికి తీస్తారు. ఈ క్రమంలోనే వీరిద్దరి విషయం లో వైయస్ జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేక పిఠాపురం నుంచి పోటీ చేస్తారా అనేది క్లారిటీ రాలేదు. మరోవైపు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారనేది కన్ఫామ్ అయిపోయింది.
ఇక ఈ మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడించడానికి వైఎస్ జగన్ ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నారా లోకేష్ పై ఆర్కే పోటీ చేసి గెలిచారు. అయితే గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే కి ప్రజల్లో విముఖత ఉంది. ఈ క్రమంలోనే మంగళగిరిలో గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. గతంలో టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి లోకేష్ రావడంతో టీడీపీ నుంచి తప్పుకొని వైసీపీలోకి చేరారు. అయితే ఇప్పుడు మంగళగిరి కి మురుగుడు లావణ్యను తీసుకొచ్చారు వైఎస్ జగన్. అయితే ఈమె మురుగుడు హనుమంతరావు కోడలు అని తెలుస్తుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంగళగిరి నుంచి రెండుసార్లు పోటీ చేసి గెలిచిన మురుగుడు హనుమంతరావు కోడలే ఈ లావణ్య అని తెలుస్తుంది. అయితే బీసీ క్యాండిడేట్ గంజి చిరంజీవిని పక్కన పెట్టి మురుగుడు లావణ్యను ఎందుకు తీసుకొచ్చారు అనే చర్చ మొదలైంది. అయితే మంగళగిరిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే మురుగుడు లావణ్య కు వైఎస్ జగన్ టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇటీవల ఓ వీడియోలో గంజి చిరంజీవి ప్రజలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. అందుకే మురుగుడు లావణ్య కి టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకైతే ఆమెను ఇన్చార్జిగానే ప్రకటించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంటుంది. ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్న క్రమంలో వైసీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎలాగైనా మంగళగిరిలో గెలవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏరికోరి మురుగుడు లావణ్యను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్కే, గంజి చిరంజీవి లాంటి వాళ్లను పక్కనపెట్టి మురుగుడు లావణ్య కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇక్కడ మంగళగిరి నుంచి ఆమె గెలుస్తారా లేక నారా లోకేష్ గెలుస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓఓడిపోయారు. సారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మరి ఈసారి గెలుస్తారా లేదా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Bharath geo Politics India : ప్రపంచ దేశాల చూపు ఇప్పుడు భారత దేశం వైపు మళ్లింది. ముఖ్యంగా ఇరాన్…
YS Sunitha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన సంచలన…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం, జనసేన…
YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రకాశం జిల్లా నుండి మళ్ళీ పూర్వ వైభవం…
Ustaad Bhagath Singh : టాలీవుడ్ లో ఇప్పుడు రీమేక్ సినిమాల గోల మామూలుగా లేదు. మన స్టార్ హీరోలు…
Realme C100 : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Realme తన కొత్త బడ్జెట్ 5G ఫోన్ రియల్మి C100 5Gను…
Induction Stove : ఇటీవలి కాలంలో చాలా ఇళ్లలో గ్యాస్ స్టవ్తో పాటు ఇండక్షన్ స్టవ్ వినియోగం గణనీయంగా పెరిగింది.…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయం ఇప్పుడు ముదురు పాకాన పడింది. ముఖ్యంగా…
Gold Silver Price Drop 17 March 2026 : బంగారం కొనాలనుకునే వారికి, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో పసిడి…
Karthika Deepam 2 March 17 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారమవుతున్న ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ 'కార్తీక…
Raw mango : వేసవి కాలం ప్రారంభమయ్యిందంటే మార్కెట్లలో పచ్చి మామిడి పండ్ల హడావిడి మొదలవుతుంది. పుల్లగా, కారం కలిపి…
Coconut Water : వేసవికాలం వచ్చేసరికి ఎండలు తీవ్రంగా పెరుగుతాయి. ఈ సమయంలో శరీరానికి చల్లదనం కలిగించే పానీయాలపై చాలా…
This website uses cookies.