Nandigam Suresh : హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ హస్తం ఉంది... ఎంపీ నందిగాం సురేష్...!
Nandigam Suresh : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వేడి విపరీతంగా రాజుకుంటూ వస్తుంది. ఈ వేడి ఎక్కడ దాకా విస్తరిస్తుందో…ఎంతమందిని దహించి వేస్తుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. మరి ముఖ్యంగా అధికార పార్టీ వై.ఎస్.ఆర్.సీ.పీ మరియు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన కూటమి మధ్య మాటల యుద్ధంతో రాజకీయాలు రసవత్సరంగా మారుతున్నాయి. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అంటే చాలా హాట్ గా ఉంటాయి. ఇక ఇప్పుడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఆ రాజకీయ వేడి తీవ్రస్థాయికి చేరింది అని చెప్పాలి. అయితే ఈ రాజకీయ రణరంగంలో ఎలాగైనా అధికారం చేజికించుకోవాలనే తపనతో జనసేన మరియు టీడీపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు కలిసి తాడేపల్లిలో జెండా అనే భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇక ఈ భారీ బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఆ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా అధికార పార్టీ వైసీపీ మంత్రులు మరియు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి రాజకీయాల్లో అసలు పనికిరారు అని చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే బహిరంగ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తాజాగా బుధవారం రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన పార్టీల జెండా సభ నిర్వహించడం జరిగింది. అయితే ఈ భారీ బహిరంగ సభకు జనం రాకపోవడంతో వెలవెలబోయింది. ఇక ఆశించిన స్థాయిలో జనాలు రాకపోవడంతో అసంతృప్తి చెందిన అధినేతలు సభ వేదికపై తాము ఏం చేస్తాము అనే విషయాన్ని చెప్పడం మానేసి…సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ఒక స్థాయిలో సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటే…పవన్ కళ్యాణ్ మాత్రం శృతి మించి వ్యవహరించారని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే సీఎం జగన్ అంటే చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కి కూడా భయం పట్టుకుందని.. అందుకే నిన్న జరిగిన సభలో 200 సార్లు మా జగనన్న పేరు ప్రస్తావించారని , వైయస్ జగన్ పేరు తీసుకురాకుండా వారి సభ కూడా జరగడం లేదంటూ ఎంపీ నందిగాం సురేష్ చెప్పుకొచ్చారు. ఆయన స్వార్థం కోసం కన్నతండ్రిపై కూడా పవన్ కళ్యాణ్ నీచం గా మాట్లాడతారని …ఊసకాళ్ల తో ఉండే పవన్ కళ్యాణ్ తాడేపల్లిలో జగన్ ఇంటిని బద్దలు కొడతాడట. ఈ విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు. అదేవిధంగా ఒకప్పటి స్టార్ హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడని ఈ ఇంటర్వ్యూ వేదికగా నందిగాం సురేష్ తెలియజేశారు. మళ్లీ జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా ఎలా తొక్కలో మాకు బాగా తెలుసు అని ,ఇక చంద్రబాబు నాయుడు అతి తెలివి ఉపయోగించి డిపాజిట్ కూడా దక్కని సీట్లను పవన్ కళ్యాణ్ కి ఇచ్చారని అందుకే జనసైనికులను ప్రశ్నించవద్దని అంటున్నారని ఈ సందర్భంగా నందిగామ సురేష్ పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.