
AP Elections : మొదటి జెండా సభలోనే కుప్ప కూలిపోయిన కూటమి... ముందంజలో వైసీపీ...!
AP Elections : ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు వ్యూహాలను రచిస్తూ తమతైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఈ సమయంలో రాజకీయ నాయకులు వేసే ప్రతి అడుగు కూడా ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పాలి. ఒక విద్యార్థికి పరీక్షలు అనేవి ఎంత ప్రధానమైనవో ఒక రాజకీయ నాయకుడికి ఎలక్షన్స్ అనేవి అంత ప్రాధాన్యమైనవి. ఇక పరీక్షల్లో ఎలా చదివారు అనే దాని పైన విద్యార్థుల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇదే ఫార్ములా ఇప్పుడు రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో లో రాజకీయ నాయకులు ఎలాంటి వ్యూహాలతో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారో అవి వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అయితే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఆరితేరినట్లుగా కనిపిస్తున్నారు.
కానీ కూటమిగా ఏర్పడిన టీడీపీ జనసేనకు మాత్రం ఈ ఫార్ములా అర్థం కావడం లేదని పలువురు తెలియజేస్తున్నారు. అందుకే ఒక విషయంలో అధికార పార్టీ వైసీపీ సక్సెస్ అయిందని జనసేన టీడీపీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందని పలువురు తెలియజేస్తున్నారు.అయితే వైసీపీ పార్టీ సిద్ధం అనే పేరుతో సభలను నిర్వహిస్తుంటే కూటమిగా ఏర్పడిన టీడీపీ మరియు జనసేన కలిసి జెండా పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ ఇప్పటివరకు భీమిలి , దెందులూరు ,రాప్తాడులో మూడు సిద్ధం సభలను నిర్వహించడం జరిగింది. ఇక ఈ సిద్ధం సభలు కూడా ఒకదానికి మించి మరొకటి సక్సెస్ అయ్యాయి. అదేవిధంగా చివరిసారిగా ఏర్పాటు చేసిన సిద్ధం సభకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాచారం ప్రకారం సౌత్ లో రాజకీయ సభలకు ఇంత జనం రావడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.ఈ విధంగా జగన్ భారీ సక్సెస్ అందుకుంటే తాజాగా ఫిబ్రవరి 28న టీడీపీ మరియు జనసేన కూటమి నిర్వహించిన “జెండా ” సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు కూడా ఎవరు ఊహించి ఉండరు.ఆ విధంగా కూటమి నిర్వహించిన జెండా సభ అట్టర్ ప్లాప్ అయిందని చెప్పాలి.
అంతేకాక ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వైసీపీ పార్టీ నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది , ఎలాంటి పనులు నిర్వహిస్తారనే విషయాల గురించి చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ జనసేన కూటమి ఏర్పాటు చేసిన జెండా సభలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వై.యస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారు ఏం చేస్తారనే విషయాలను ప్రజలకు చెప్పడం మానేసి సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. అంతేకాక జన సమూహం లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ కనిపించిందని చెప్పాలి. ఇలా మొదటి సభ అట్టర్ ప్లాప్ అవడంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
This website uses cookies.