Home » Andhra Pradesh » Rains In These Districts Of Ap
andhra pradesh

Rain Alert : ప్రజలకు అలెర్ట్ .. రేపు ఈ జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు.. !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: March 21, 2026, 2:11 pm
Advertisement

Rain Alert : ఎండలు తీవ్రంగా మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొంత ఉపశమనం లభించనున్నట్లు వాతావరణ శాఖ సంకేతాలు ఇస్తోంది. బంగాళాఖాతం గగనతలంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ చెదురుమదురు నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Rains in these districts of AP

Rain Alert : ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావం

పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం చురుకుగా కొనసాగుతోంది. ఇది మరింత విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ద్రోణి ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతాల మీదుగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

Advertisement

Rain Alert : కోస్తా జిల్లాల్లో వర్షాల సూచనలు

కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వాతావరణం మరింత అనుకూలంగా మారుతోంది. పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేటి నుండి వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. తీరప్రాంతాల్లో కొన్నిచోట్ల బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

Rain Alert : రాయలసీమలో కూడా వర్షాల చాన్స్

రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కూడా వాతావరణ మార్పులు కనిపించనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద ఆశ్రయం తీసుకోకూడదని, ఖాళీ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు వీసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైన జాగ్రత్తలు పాటించడం అత్యంత అవసరం అని పేర్కొన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి