
RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..?
RK Roja vs YS Jagan : రోజా ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నగరి నియోజకవర్గంలో నేషనల్ హైవే నిర్మాణం కోసం సుమారు 600 ఏళ్ల నాటి పురాతన ఆలయాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతుండటంతో, దానిని ఆపాలని కోరుతూ ఆమె కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అయితే ఈ పర్యటన వెనుక అసలు ఉద్దేశం వేరే ఉందనే చర్చ మొదలైంది. ఒక పక్క తిరుమల లడ్డూ నెయ్యి వివాదంతో జగన్ మోహన్ రెడ్డి ఇరకాటంలో ఉన్న సమయంలో, రోజా హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. తన సొంత నియోజకవర్గ సమస్యల సాకుతో ఢిల్లీలో అడుగుపెట్టిన రోజా, అక్కడ తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ కి తెలియకుండా ఏవైనా కొత్త దారులు వెతుక్కుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..?
పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యత తగ్గడం వల్ల రోజా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ ఆలయ వివాదాన్ని అస్త్రంగా చేసుకుని ఆమె నేరుగా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి వంటి జగన్ నమ్మకస్తులను వెంట పెట్టుకుని వెళ్లడం ద్వారా ఇది పార్టీ పనిగానే కనిపిస్తున్నా, లోలోపల మాత్రం ఆమె తన సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. జగన్ ప్రస్తుతం హిందూ వ్యతిరేక విమర్శలను ఎదుర్కొంటున్న తరుణంలో, రోజా మాత్రం తనే స్వయంగా ఒక హిందూ దేవాలయాన్ని కాపాడే రక్షకురాలిగా ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొందాలని చూడటం పార్టీకి ఒక రకమైన ఇబ్బందికర పరిణామమే.
ఈ పర్యటన ద్వారా రోజా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. నితిన్ గడ్కరీతో సమావేశం తర్వాత ఆమె మాట్లాడుతూ, ఆలయాన్ని కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే కేంద్రానికి అభ్యంతరం లేదని చెప్పడం ద్వారా బంతిని చంద్రబాబు కోర్టులోకి నెట్టారు. అయితే ఇదే సమయంలో జగన్ కి ఏమాత్రం లీడ్ ఇవ్వకుండా మొత్తం క్రెడిట్ అంతా తానే తీసుకోవాలని రోజా ప్రయత్నించడం వెన్నుపోటు లాంటిదే అని కొందరు వైసిపి కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన వ్యక్తిగత హైప్ కోసం ఇలాంటి పర్యటనలు చేయడం జగన్ నాయకత్వానికి విరుద్ధంగా వ్యవహరించడమే అవుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఢిల్లీలో అడుగుపెట్టిన రోజా వేసిన అడుగులు జగన్ కి మేలు చేస్తాయా లేక ఆమె సొంత దారి చూసుకుంటుందా అనేది వేచి చూడాలి.
Mallareddy : తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన స్టైల్తో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి…
Ajit Doval : భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు అమెరికా రాయబారి సెర్గియో గోర్ మధ్య…
Ration Card : గిరిజన ప్రాంతాల్లో నివసించే రేషన్ కార్డుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఒక…
Revanth Reddy : సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
US Israel Iran : అమెరికాలోని వైట్ హౌస్ ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయింది. ఇరాన్ పై యుద్ధం…
YS Vijayamma : కన్నతల్లి అని కూడా చూడకుండా వైఎస్ విజయమ్మపై వైసీపీ సోషల్ Ysrcp Social Media మీడియా…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.…
Ration Card : దేశంలోని కోట్లాది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పేదలకు ఆహార…
Dairies : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక రంగానికి ఊతమిచ్చే కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం పశు పోషకులకు ఊరట కలిగించింది.…
kerosene : ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన కిరోసిన్ స్టవ్లు, దీపాలు ఇప్పుడు అరుదుగా మారాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు…
Oppo 5G Smartphone Review : భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రముఖ బ్రాండ్…
Gold Silver Rate 23 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు, ముఖ్యంగా…
This website uses cookies.